గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు – గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి

మన న్యూస్ సాలూరు జూన్ 17:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో ఉన్న బాలికల ఆశ్రమ పాఠశాలలో మంగళవారం దర్తి అబ జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ (DA-JGUA) అభయాన్ సదస్సుకు గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు గుమ్మిడి సంధ్యారాణి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దర్తి అబ జన్ జాతీయ గ్రామీణ ఉత్కర్ష్ అభియాన్ పథకం గిరిజన గ్రామాల అభివృద్ధి నిమిత్తం 2024 అక్టోబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ పథకం ఐదేళ్లపాటు ఉంటుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 155 గ్రామాలు ఎంపిక చేసి, అక్కడ నివసించే గిరిజనులకు జీవనోపాధి కల్పించి ఆర్థిక సాధికారత వంటి కీలక రంగాల్లో చర్యలు చేపడతామన్నారు. ఈ పథకం జూన్ 15 నుండి 30వ తేదీ వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గిరిజనులకు 14 ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు వాటిని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏపీఓ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్, ఆ గ్రామ సర్పంచ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..