ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరులో జాగ్రత్తలు పాటించాలి నకిలీవిత్తన వ్యాపారాలు వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దు విజలెన్స్ మోనటరింగ్ కమిటీ సభ్యులు మణికుమార్ హెచ్చరిక

మన న్యూస్ పాచిపెంట జూన్ 17: ఎస్ టి కులాల ధ్రువీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని, అలాగే రైతులు మొక్కజొన్న, పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో నకిలీ వ్యాపారులను నమ్మొద్దని, వారి దగ్గర కొనుగోలు చేయవద్దని, షాపుల్లో విత్తనాలు విక్రయించే వ్యాపారులు వద్ద కొనుగోలు చేస్తే వారి దగ్గర బిల్లులు తీసుకోవాలని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జే మణికుమార్ కోరారు. మంగళవారం నాడు ఆయన పత్రికా విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాచిపెంట మండలంలో ఎస్టీ కుల దృవీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ జాగ్రత్తలు పాటించి అవసరమైతే దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి నాలుగు తరాలు కుటుంబం గురించి ఆరా తీసి గ్రామస్తులు వాంగ్మూలం తీసుకొని కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు. గతంలో చాలామంది నకిలీ కుల దృవీకరణ పత్రాలు తో చలా మణి అవుతున్నారని వారిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని అందుచేత రెవెన్యూ శాఖ తగు జాగ్రత్తలు పాటించి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు.నకిలీ విత్తనాలు తో రైతులు జాగ్రత్త :- అమాయకపు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని,రైతులు మొక్కజొన్న,పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని లైసెన్స్ ఉన్న షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జే మణికుమార్ రైతులను కోరారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కారణంగా చాలామంది నకిలీ వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయాలు జరుపుతారని అటువంటి వారి పట్ల జాగ్రత్తలు వహించి బిల్లులు ఇచ్చే షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు. లైసెన్స్ పొందిన దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసినట్లయితే ఇన్సూరెన్స్ ఉంటుందని, నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు ఆయన హితవు పలికారు.పంట ఎక్కువ దిగుబడి వస్తుందని సీడ్స్ వ్యాపారస్తులు రైతులను మోసం చేయడం అలవాటుగా మారిందని అటువంటి మారి మాటలు నమ్మి మోసపోవద్దని రైతులను ఆయన కోరారు. అటువంటి వారిపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించి ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని కోరారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..