

మన న్యూస్ పాచిపెంట జూన్ 17: ఎస్ టి కులాల ధ్రువీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని, అలాగే రైతులు మొక్కజొన్న, పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో నకిలీ వ్యాపారులను నమ్మొద్దని, వారి దగ్గర కొనుగోలు చేయవద్దని, షాపుల్లో విత్తనాలు విక్రయించే వ్యాపారులు వద్ద కొనుగోలు చేస్తే వారి దగ్గర బిల్లులు తీసుకోవాలని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జే మణికుమార్ కోరారు. మంగళవారం నాడు ఆయన పత్రికా విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాచిపెంట మండలంలో ఎస్టీ కుల దృవీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ జాగ్రత్తలు పాటించి అవసరమైతే దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి నాలుగు తరాలు కుటుంబం గురించి ఆరా తీసి గ్రామస్తులు వాంగ్మూలం తీసుకొని కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు. గతంలో చాలామంది నకిలీ కుల దృవీకరణ పత్రాలు తో చలా మణి అవుతున్నారని వారిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని అందుచేత రెవెన్యూ శాఖ తగు జాగ్రత్తలు పాటించి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు.నకిలీ విత్తనాలు తో రైతులు జాగ్రత్త :- అమాయకపు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని,రైతులు మొక్కజొన్న,పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని లైసెన్స్ ఉన్న షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జే మణికుమార్ రైతులను కోరారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కారణంగా చాలామంది నకిలీ వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయాలు జరుపుతారని అటువంటి వారి పట్ల జాగ్రత్తలు వహించి బిల్లులు ఇచ్చే షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు. లైసెన్స్ పొందిన దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసినట్లయితే ఇన్సూరెన్స్ ఉంటుందని, నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు ఆయన హితవు పలికారు.పంట ఎక్కువ దిగుబడి వస్తుందని సీడ్స్ వ్యాపారస్తులు రైతులను మోసం చేయడం అలవాటుగా మారిందని అటువంటి మారి మాటలు నమ్మి మోసపోవద్దని రైతులను ఆయన కోరారు. అటువంటి వారిపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించి ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని కోరారు.