ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరులో జాగ్రత్తలు పాటించాలి నకిలీవిత్తన వ్యాపారాలు వద్ద విత్తనాలు కొనుగోలు చేయొద్దు విజలెన్స్ మోనటరింగ్ కమిటీ సభ్యులు మణికుమార్ హెచ్చరిక

మన న్యూస్ పాచిపెంట జూన్ 17: ఎస్ టి కులాల ధ్రువీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు తగు జాగ్రత్తలు పాటించాలని, అలాగే రైతులు మొక్కజొన్న, పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో నకిలీ వ్యాపారులను నమ్మొద్దని, వారి దగ్గర కొనుగోలు చేయవద్దని, షాపుల్లో విత్తనాలు విక్రయించే వ్యాపారులు వద్ద కొనుగోలు చేస్తే వారి దగ్గర బిల్లులు తీసుకోవాలని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జే మణికుమార్ కోరారు. మంగళవారం నాడు ఆయన పత్రికా విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాచిపెంట మండలంలో ఎస్టీ కుల దృవీకరణ పత్రాలు మంజూరు విషయంలో రెవెన్యూ శాఖ జాగ్రత్తలు పాటించి అవసరమైతే దరఖాస్తుదారుని ఇంటికి వెళ్లి నాలుగు తరాలు కుటుంబం గురించి ఆరా తీసి గ్రామస్తులు వాంగ్మూలం తీసుకొని కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని కోరారు. గతంలో చాలామంది నకిలీ కుల దృవీకరణ పత్రాలు తో చలా మణి అవుతున్నారని వారిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయని అందుచేత రెవెన్యూ శాఖ తగు జాగ్రత్తలు పాటించి కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరారు.నకిలీ విత్తనాలు తో రైతులు జాగ్రత్త :- అమాయకపు రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని,రైతులు మొక్కజొన్న,పత్తి విత్తనాలు కొనుగోలు విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని లైసెన్స్ ఉన్న షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు జే మణికుమార్ రైతులను కోరారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కారణంగా చాలామంది నకిలీ వ్యాపారులు నకిలీ విత్తనాలు విక్రయాలు జరుపుతారని అటువంటి వారి పట్ల జాగ్రత్తలు వహించి బిల్లులు ఇచ్చే షాపుల్లో విత్తనాలు కొనుగోలు చేయాలని కోరారు. లైసెన్స్ పొందిన దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేసినట్లయితే ఇన్సూరెన్స్ ఉంటుందని, నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని రైతులకు ఆయన హితవు పలికారు.పంట ఎక్కువ దిగుబడి వస్తుందని సీడ్స్ వ్యాపారస్తులు రైతులను మోసం చేయడం అలవాటుగా మారిందని అటువంటి మారి మాటలు నమ్మి మోసపోవద్దని రైతులను ఆయన కోరారు. అటువంటి వారిపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించి ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని కోరారు.

Related Posts

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

మన న్యూస్,తిరుపతి:తమిళనాడు రాష్ట్రం మదురైలో హిందూ మున్నానీ సంస్థ నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం విమానాశ్రయంకు చేరుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆరణి మదన్. తిరుపతి నుంచి సభలో పాల్గొనేందుకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు