

హైదరాబాద్/తిరుపతి , మన న్యూస్ , సోమవారం జూన్ 16 :- హైదరాబాద్ త్యాగరాయ గాన సభ ప్రాంగణంలో తెలుగు కళారత్నాల సేవా సమితి ప్రోగ్రాం డైరెక్టర్ అండ్ ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ ధనాశి ఉషారాణి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో వివిధ రంగాల వారిలో సామాజిక నేత్త కార్యక్రమాలలో తమ వంతు సేవలకు గాను సైకాలజిస్ట్,విలేకరి రాధికా రాణి కు తెలుగు కళా రత్నాలు ప్రతిభా అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది.ఈ సందర్భంగా న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ అండ్ తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ నల్గొండ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ శివలీల మాట్లాడుతూ ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రోత్సహించాలనే సంకల్పంతో సీనియర్ పాత్రికేయులు,విశ్లేషకులు,ఎడిటర్,కవిబ్రహ్మ ప్రసాద్ గారి సూచన మేరకే కాకుండా విలేకరి,సామాజిక వేత్త,సైకాలజిస్ట్ రాధికారాణి సేవలను పరిశీలించిన మేరకు తెలుగు కళారత్నాలు ప్రతిభా అవార్డును ఎంపిక చేయడం ప్రోత్సహించడం,పెద్దల సమక్షంలో అందులో ఆత్మీయ శ్రేయోభిలాషులు సీనియర్ జర్నలిస్ట్,విశ్లేషకులు ప్రసాద్ సమక్షంలో అందజేయడం సంతోషకరంగా ఉన్నదన్నారు.అవార్డు గ్రహిత సైకాలజిస్ట్,విలేకరి,సామాజిక నేత్త రాధికారాణి మాట్లాడుతూ కార్యక్రమ సీఈఓ డాక్టర్ యు.వి.రత్నం,డాక్టర్ దానశి ఉషారాణి సమక్షంలో న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ డాక్టర్ శివలీల రెడ్డి సహకారంతో పాటు ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్,విశ్లేషకుడు,ఎడిటర్ విజయసంకల్పం ప్రసాద్ ప్రోత్సాహంతో తెలుగు కళారత్నాలు ప్రతిభా అవార్డును అందుకోవడం సంతోషకరంగా ఉన్నదన్నారు.ప్రతిభ కల్గిన వారందరికీ డాక్టర్ శ్రీనివాస్,మీనగా గోపి, హైకోర్ట్ అడ్వకేట్ డాక్టర్ జగదీశ్వర్ రావు,డాక్టర్ ఎం విజయలక్ష్మి,డాక్టర్ విజయలక్ష్మి,హరి కుమార్,ఇంద్ర కుమార్,జిల్లేపల్లి నరేష్,చందోల ప్రసన్న మాలతి నాయుడు లు సంయుక్తంగా విలేకరి,సైకాలజిస్ట్,సామాజిక నేత్త కె.రాధికారాణి ని గుర్తించి ప్రత్యేకంగా సన్మానించి ఉత్తమ సేవలకు గాను తెలుగు కళారత్నాలు ప్రతిభా అవార్డుతో గౌరవించి అభినందనలు తెలియజేశారు.
