వెంకటాపురం మండలంని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేత

తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని.

Mana News , నూగూరు వెంకటాపురం, మార్చి 10, సోమవారం: వెంకటాపురం మండలంను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని కోరుతూ మండల అభివృద్ధికి కావాల్సిన పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని గారు ములుగు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం మండలం అన్ని రంగాలలో అభివృద్ధికి చాలా వెనకబడి ఉందని, కాలం మారుతున్న, జనాభా పెరుగుతున్న, మండల కేంద్రంలో ప్రజలు నానా అవస్థలు పడుతున్నా గానీ మండల కేంద్రం మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు ఇకనైనా మండల అభివృద్ధి కొరకు పునరాలోచించాలని కోరారు. వెంకటాపురం మండల కేంద్రంలో పెట్రోల్ బంక్ నుండి ఉమారామలింగేశ్వర గుడి వరకు రోడ్డు విస్తరణ చేసి, సెంట్రల్ లైట్ రోడ్ ఏర్పాటు చేయాలని, వెంకటాపురం మండల యువత ఉపాధి కొరకు రెండు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, వెంకటాపురం మండలం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని, మండల కేంద్రంలో అంబేద్కర్, కొమరం భీమ్ కమ్యూనిటీ భవనాలు ఏర్పాటు చేయాలని, వెంకటాపురం మండలంలో నడిచే ఇసుక క్వారీల ఆదాయం నుండి 80శాతం నిధులు మండల అభివృద్ధికి వినియోగించాలని, మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని, చిన్న తరహా వ్యాపారస్తులకు మరియు కూరగాయల వ్యాపారస్తులకు శాశ్వత కూరగాయల మరియు జనరల్ మార్కెట్ నీ ఏర్పాటు చేయాలని, మండలంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని, ఇల్లు లేని వాళ్లకు, గుడిసెలు, రేకుల ఇంటిలో ఉండే పేద వాళ్ళ అందరికీ ప్రత్యేక బడ్జెట్ కేటాయించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ప్రతి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన అన్ని రోడ్లు పూర్తి చేయాలని, ప్రతి గ్రామంలో మంచి నీటి కొరత లేకుండా చూడాలని, వరంగల్ నుండి మేడారం మరియు ఏటురునాగరం మీదుగా వెంకటాపురం వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ, ఇంకా మొదలైన మండల అభివృద్ధి డిమాండ్లతో కూడిన వినతపత్రాన్ని కలెక్టర్ గారికి అందజేసినట్లు తెలిపారు. అలాగే వెంకటాపురం మండల అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రులను త్వరలో కలుస్తానని, వరంగల్ నుండి మేడారం మరియు ఏటూరునాగారం మీదుగా వెంకటాపురం వరకు రైల్వే లైన్ ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులను కలుస్తానని తెలిపారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 5 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///