

మనన్యూస్:గద్వాల జిల్లా గతంలో డబ్బులు వసూలు చేసి పని కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రతి కార్మికుని కి ఉపాధి కల్పించాలి గొంగళ్ళ రంజిత్ కుమార్డి గడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గులాంబ గద్వాల
గద్వాల మండలంలోని పూడూరు దగ్గర ఉన్న గోదాములలో పని కల్పిస్తామని పూడూరు, ఎర్రవల్లి,జమ్మిచేడు,మేలచెరువు,జంగంపల్లి,కొండపల్లి తదితర గ్రామాలలో సుమారు 600 మందికి పైగా 40 వేల నుండి లక్ష రూపాయల దాకా స్థానిక గోదాములు ప్రారంభమవుతే అందరికీ పని కల్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని, ప్రస్తుతం వీరికి కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించిన వారికి ఉపాధి కల్పించారని అన్నారు. వెంటనే స్థానికులకు ఉపాధి కల్పించాలని కోరారు.త్వరలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 600 మంది కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి వారి ఐక్యతతో ఉండేలా యూనియన్ ఏర్పాటు చేయాలని వారి సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి వారు పోరాడతారని అన్నారు అనేక రాజకీయ కుట్రలతో ఇన్ని సంవత్సరాలు గోదాములను నడవకుండా చేశారని ప్రస్తుతం అన్ని సమస్యలను పరిష్కారం చేసుకొని చట్టబద్ధంగా ప్రారంభమైన గోదామును కొంతమంది కుట్రతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని న్యాయపరంగా సక్రమంగా ఉన్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు,ప్రత్యక్షంగా,పరోక్షంగా రెండు వేల కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అట్లాంటి గోదామును కేవలం రాజకీయ కుట్రతో అడ్డుకోవడం తగదని అన్నారు గతంలో స్థానిక గ్రామాలకు చెందిన కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడి ఇక్కడ గోదాము వస్తే మాకు పని కలుగుతుందని ఆశతో డబ్బులు కట్టి 14 సంవత్సరాలు కావస్తున్న మాకు ఉపాధి లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.త్వరలో కార్మికులతో పాటు రవాణా కు చెందిన అసోసియేషన్ వారితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి వీరికి ఉపాధి కల్పించేలా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తామని జిల్లాలోనె అత్యధికంగా ఉపాధి కల్పించే ఈ గోదాములను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా స్థానికులందరికి ఉంది అన్నారు,ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.