నేటి నుండి శ్రీ వెంగమాంబ మహోత్సవాలు..!!!

దుత్తలూరు, మన న్యూస్ : దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి సుమారు 4 నుంచి 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు ఆలయ ధర్మకర్తలు అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం అమ్మవారి పుట్టినిల్లు వడ్డె పాలెం లో జరిగే పసుపు దంచు కార్యక్రమంతో నిలుపు మొదలవుతుంది. 16వ తేదీన సంతానం లేనటువంటి మహిళలు అమ్మవారిని వరపడుట, 17వ తేదీన రథోత్సవం, 18వ తేదీన కళ్యాణోత్సవం పసుపు కుంకుమ ఉత్సవం రాత్రికీ ప్రధానోత్సవం జరుగుతుంది. 19వ తేదీన అమ్మవారికి పొంగళ్ళు రాష్ట్రస్థాయిలో ఎడ్లబండ్లు లాగు పందాలు జరుగుతాయి. ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాటలు లేకుండా ఉత్సవాలను పగడ్బందీగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక ఏర్పాట్లు చొరవ తీసుకుంటున్నారు. అమ్మవారు మహోత్సవాలు చూడడానికి వచ్చిన భక్తులకు ఉచిత భోజనంతో పాటు త్రాగునీటీ సమస్య లేకుండా వివిధ మార్గాలలో కుళాయిలు ఏర్పాటు చేశారు ఆలయానికి వెళ్లే మార్గంలో భక్తులకు ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారిని ఉషాశ్రీ తెలిపారు.

  • Related Posts

    బద్వేల్లో సచివాలయ ఉద్యోగులు జీవో నెం, 5కి వ్యతిరేకంగా నిరసన.

    బద్వేల్, జూన్ 23: మన న్యూస్: జీవో నెంబర్ 5కి వ్యతిరేకంగా బద్వేల్ ఆర్డీవో కార్యాలయం నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం సచివాలయ ఉద్యోగులు భారీగా నిరసన వ్యక్తం చేశారు ‘…

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం గ్రామంలో లింగంపర్తి రోడ్లో,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్య రంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    • By RAHEEM
    • June 23, 2025
    • 2 views
    విద్య రంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    బద్వేల్లో సచివాలయ ఉద్యోగులు జీవో నెం, 5కి వ్యతిరేకంగా నిరసన.

    బద్వేల్లో సచివాలయ ఉద్యోగులు జీవో నెం, 5కి వ్యతిరేకంగా నిరసన.

    ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

    • By RAHEEM
    • June 23, 2025
    • 6 views
    ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

    పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

    • By RAHEEM
    • June 23, 2025
    • 5 views
    పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ