

దుత్తలూరు, మన న్యూస్ : దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి సుమారు 4 నుంచి 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు ఆలయ ధర్మకర్తలు అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం అమ్మవారి పుట్టినిల్లు వడ్డె పాలెం లో జరిగే పసుపు దంచు కార్యక్రమంతో నిలుపు మొదలవుతుంది. 16వ తేదీన సంతానం లేనటువంటి మహిళలు అమ్మవారిని వరపడుట, 17వ తేదీన రథోత్సవం, 18వ తేదీన కళ్యాణోత్సవం పసుపు కుంకుమ ఉత్సవం రాత్రికీ ప్రధానోత్సవం జరుగుతుంది. 19వ తేదీన అమ్మవారికి పొంగళ్ళు రాష్ట్రస్థాయిలో ఎడ్లబండ్లు లాగు పందాలు జరుగుతాయి. ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాటలు లేకుండా ఉత్సవాలను పగడ్బందీగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక ఏర్పాట్లు చొరవ తీసుకుంటున్నారు. అమ్మవారు మహోత్సవాలు చూడడానికి వచ్చిన భక్తులకు ఉచిత భోజనంతో పాటు త్రాగునీటీ సమస్య లేకుండా వివిధ మార్గాలలో కుళాయిలు ఏర్పాటు చేశారు ఆలయానికి వెళ్లే మార్గంలో భక్తులకు ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారిని ఉషాశ్రీ తెలిపారు.