

వింజమూరు, మన న్యూస్ : వింజమూరు మండలం జనార్ధన పురం గ్రామానికి చెందిన నల్లపునేని మల్లేష్ తమ్ముడు, నల్లపునేని నాగార్జున(28) శుక్రవారం మృతి చెందగా, స్థానిక నాయకుల ద్వారా సమాచారం అందుకున్న ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, ఆదేశాల మేరకు వింజమూరు టిడిపి నాయకులు వెళ్లి, మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చి శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మృతుడు నల్లపునేని నాగార్జున కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు చరవాణి ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో పోలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య, మాజీ మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి, చల్లా శ్రీనివాసుల యాదవ్, కొండపల్లి వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.