

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రత్తిపాడు
నియోజక వర్గంలో వివిధ గ్రామాలకు చెందిన 12 మంది సీఎంఆర్ఎఫ్ లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 13,95,118 రూపాయలు విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అందజేశారు. ప్రత్తిపాడు మండలం పెద్ద శంకర్లపూడి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్దిదారుల కుటుంబ సభ్యులకు, ఆయా గ్రామాల ఎన్ డి ఏ కూటమి శ్రేణుల సమక్షంలో బ్యాంక్ చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్య ప్రభ మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించి, ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నియోజవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.