మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మన న్యూస్,కోవూరు, ఏప్రిల్ 24:– రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్థశ పట్టిందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అన్నారు. భవిష్యత్తులో కోవూరు నియోజకవర్గం నుంచి రాష్ట్రస్థాయిలో తొలిర్యాంకు సాధించేలా చూడాలన్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతమ్మ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విపిఆర్‌ నివాసంలో ఎమ్మెల్యేను కలిసిన విద్యార్థులు.. ఆమె ఆశీసులు అందుకున్నారు. అలాగే ఇందుకూరుపేట మండలంలో 593 మార్కులతో తొలిస్థానం సాధించిన గుడి భార్గవ్‌ అనే విద్యార్థికి టిడిపి నాయకులు దాసరి విజయ్‌ తన భార్య జ్ఞాపకార్థం 25 వేల నగదు బహుమతిని ఎమ్మెల్యే చేతులమీదుగా అందించారు. అలాగే మండలానికి చెందిన టిడిపి నాయకులు సతీష్‌.. 591 మార్కులు సాధించిన నేహా పర్విన్‌కు సిగమాల పుల్లమ్మ జ్ఞాపకార్థం 10 వేల పురస్కారం ఎమ్మెల్యే చేతులమీదుగా అందించి ప్రోత్సహించారు. ఇక అమ్మ చారిటబుల్‌ ట్రస్ట్ తరుపున ఎమ్మెల్యే చేతుల మీదుగా 586 మార్కులు వచ్చిన నెల్లూరు హారికకు ట్రస్ట్ వ్యవస్థాపకులు దొడ్ల మల్లికార్జున్ 5 వేల రూపాయలు బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించి పురస్కారాలు అందించడం గొప్ప విషయమన్నారు. ఇంతబాగా చదువు చెబుతున్నందుకు ఉపాధ్యాయులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి నారా లోకేష్‌ సహకారంతో నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ట్రిపుల్‌ ఐటీల్లో సీటు సాధించేలా విద్యార్థులను గైడ్‌ చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..