టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత

Mana News :- తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) ఆదివారం కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దాదాపు వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసి ప్రముఖ విద్వాంసుడిగా ప్రసిద్ధికెక్కారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనవుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు వంటి కీర్తనలకు స్వరాలు సమకూర్చారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. 600లకుపైగా అన్నమాచార్య సంకీర్తనలకు ఆయన స్వర కల్పన చేశారు. సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పాటలు పాడారు. గత శుక్రవారమే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇంతలోనే ఆయన మరణించారన్న వార్త సంగీత ప్రియులను విచారంలో ముంచేసింది. గరిమెళ్ల మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి :- గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1978 నుంచి 2006 వరకు టీటీడీ ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ల.. 600కుపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన మహనీయుడని చంద్రబాబు కొనియాడారు. సంగీతంలో అమితమైన ప్రావీణ్యం కలిగిన గరిమెళ్ల తిరుమల శ్రీవారి సేవలో తరలించారన్నారు. తనదైన మధుర గాత్రంతో శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపా కటాక్షాలకు పాత్రుడయ్యారని, అలాంటి వ్యక్తి మనల్ని విడిచి వెళ్లడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. గరిమెళ్ల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గరిమెళ్ల మృతిపై మంత్రి నారా లోకేష్, టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు