టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూత

Mana News :- తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (76) ఆదివారం కన్నుమూశారు. తిరుపతిలోని తన స్వగృహంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దాదాపు వెయ్యికిపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వర కల్పన చేసి ప్రముఖ విద్వాంసుడిగా ప్రసిద్ధికెక్కారు. వినరో భాగ్యము విష్ణుకథ, జగడపు చనవుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు వంటి కీర్తనలకు స్వరాలు సమకూర్చారు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్. 600లకుపైగా అన్నమాచార్య సంకీర్తనలకు ఆయన స్వర కల్పన చేశారు. సంప్రదాయ కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పాటలు పాడారు. గత శుక్రవారమే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇంతలోనే ఆయన మరణించారన్న వార్త సంగీత ప్రియులను విచారంలో ముంచేసింది. గరిమెళ్ల మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి :- గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి చెందడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 1978 నుంచి 2006 వరకు టీటీడీ ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ల.. 600కుపైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన మహనీయుడని చంద్రబాబు కొనియాడారు. సంగీతంలో అమితమైన ప్రావీణ్యం కలిగిన గరిమెళ్ల తిరుమల శ్రీవారి సేవలో తరలించారన్నారు. తనదైన మధుర గాత్రంతో శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపా కటాక్షాలకు పాత్రుడయ్యారని, అలాంటి వ్యక్తి మనల్ని విడిచి వెళ్లడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. గరిమెళ్ల కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గరిమెళ్ల మృతిపై మంత్రి నారా లోకేష్, టీడీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Related Posts

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!