Mana News :- అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు బంగారుపాలెం సీఐ శ్రీనివాసులు శనివారం తెలిపారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని బలిజపల్లికి చెందిన వేమన వద్ద 30 బాటిళ్లు, తంబకుప్పంలోని మునిరత్నం రెడ్డి వద్ద 50 బాటిళ్లు, విరూపాక్ష పురానికి చెందిన గోపి వద్ద 30 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు.
