Mana News :- మహారాష్ట్ర కలకలం చోటు చేసుకుంది. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేశారు. సర్పంచ్‌ హత్య కేసులో మంత్రి ధనంజయ్‌పై ఆరోపణలు వచ్చాయి.. హత్యా ఆరోపణలతో మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు ధనంజయ్‌. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. సర్పంచ్‌ హత్య కేసులో మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేయడంతో… మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.దీనిపై ప్రతిపక్షాలు కూడా గట్టిగానే పోరాడుతున్నాయి. మహారాష్ట్ర లో కొత్త సర్కార్‌ ఏర్పాటు అయి… 6 నెలలు కాకముందే….. మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముం డే రాజీనామా చేశారని ప్రతి పక్షాలు కౌంటర్‌ ఇస్తున్నాయి. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ ఆదేశాల మేరకు మహా రాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా చేశారని అంటున్నారు. మరి మహారాష్ట్ర మంత్రి ధనంజయ్‌ ముండే రాజీనామా పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *