నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్.. నెలకు 5 వేలు ఇచ్చే కొత్త స్కీమ్ !

Mana News :- విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులకు ఓ తీపి కబురు. ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్న వారిని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అందిస్తున్నాయి.ఈ క్రమంలోనే నిరుద్యోగులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.నిరుద్యోగులకు సంబంధించి ఎన్నో పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. రీసెంట్ గా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు సరికొత్త స్కీమును ఆవిష్కరించింది. అదే పీఎం ఇంటర్న్ షిప్ పథకం. ఈ స్కీమ్ తో ఎంతో మంది నిరుద్యోగులకు ఊరట లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పీఎం ఇంటర్న్ షిప్ పథకం వివరాలు:- ఈ స్కీము కింద నిరుద్యోగులకు ఏడాదిపాటు ట్రైనింగ్ అందించనున్నారు. ఉపాధి కల్పిచండంతో పాటు ట్రైనింగ్ సమయంలో నెలకు రూ. 5వేల స్టై ఫండ్ కూడా అందించనున్నట్టు వెల్లడించారు. ఇలా ఏడాది పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు.ఈ లెక్కన నెలకు ఐదు వేలు అంటే.. సంవత్సరానికి రూ. 60వేలు అందించనున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రధాన్ మంత్రి జీవన్ బీమా, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన వంటి స్కీమ్స్ ద్వారా ఇన్సూరెన్స్ కవరేజీ కూడా లభిస్తుందని అర్దం అవుతోంది. ఆరు నెలలు ఇంటర్న్ షిప్ తర్వాత వారికి ఉపాధి లభిస్తుంది.ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలంటే అభ్యర్ధులు పదవ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన వారంతా అర్హులని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 11వ తేదీ వరకే సమయం ఉందని చెబుతున్నారు. ఇందుకు 21 నుంచి 24 ఏళ్ల లోపు వారు అర్హులని వివరించారు. అందుకోసం https://pminternship.mca.gov.in/login/ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.రిజిస్టర్ చేసుకునే విధానం :- రిజిస్టర్ చేసుకునేందుకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. పైన ఇవ్వబడిన లింకు ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత దాన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అవసరమైన వివరాలన్నింటిని అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Related Posts

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 5 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..