అర్జెంట్‌గా పిల్లల్ని కనండి..! కొత్తగా పెళ్లైనవారికి తమిళనాడు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి.. ఎందుకంటే?

Mana News, Tamilnadu :- కొత్తగా పెండ్లి చేసుకున్న దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, స్టాలిన్ ఈ వ్యాఖ్యల చేయడం ద్వారా కేంద్రం ప్రభుత్వంపై వ్యంగ్యాంగా విమర్శలు చేశారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన పనులను కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నేపథ్యంలో జనాభా ఆధారంగా ఇది జరిగితే రాష్ట్రానికి ఎనిమిది నియోజకవర్గాల వరకు తగ్గుతాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొద్దిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈనెల 5న సీఎం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ నూతన దంపతులు అర్జెంట్ గా పిల్లలను కనాలంటూ వ్యాఖ్యానించారు.స్టాలిన్ మాట్లాడుతూ.. ”నవ దంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో నేను చెప్పాను. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోన్న వేళ ఇప్పడలా చెప్పలేను. ఇంతకుముందు మేం కుటుంబ నియంత్రణపై దృష్టిసారించాం. కానీ, ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే.. లోక్ సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడింది. అందుకే నేను నేను చెప్పేది ఒక్కటే. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి” అంటూ రాష్ట్ర ప్రజలకు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

Related Posts

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

  • By JALAIAH
  • October 29, 2025
  • 4 views
సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!