అర్జెంట్‌గా పిల్లల్ని కనండి..! కొత్తగా పెళ్లైనవారికి తమిళనాడు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి.. ఎందుకంటే?

Mana News, Tamilnadu :- కొత్తగా పెండ్లి చేసుకున్న దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, స్టాలిన్ ఈ వ్యాఖ్యల చేయడం ద్వారా కేంద్రం ప్రభుత్వంపై వ్యంగ్యాంగా విమర్శలు చేశారు. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన పనులను కేంద్ర ప్రభుత్వం 2026లో చేపట్టనున్న నేపథ్యంలో జనాభా ఆధారంగా ఇది జరిగితే రాష్ట్రానికి ఎనిమిది నియోజకవర్గాల వరకు తగ్గుతాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొద్దిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై చర్చించేందుకు ఈనెల 5న సీఎం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. నాగపట్నంలోని ఓ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ నూతన దంపతులు అర్జెంట్ గా పిల్లలను కనాలంటూ వ్యాఖ్యానించారు.స్టాలిన్ మాట్లాడుతూ.. ”నవ దంపతులు సంతానం విషయంలో కొంత సమయం తీసుకోవాలని గతంలో నేను చెప్పాను. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. రానున్న కాలంలో నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోన్న వేళ ఇప్పడలా చెప్పలేను. ఇంతకుముందు మేం కుటుంబ నియంత్రణపై దృష్టిసారించాం. కానీ, ఇప్పుడు జనాభా పెంచుకోక తప్పని పరిస్థితి. ఎందుకంటే.. లోక్ సభ స్థానాలు తగ్గే పరిస్థితి ఏర్పడింది. అందుకే నేను నేను చెప్పేది ఒక్కటే. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు త్వరగా పిల్లలను కనండి. వారికి మంచి తమిళ పేర్లు పెట్టండి” అంటూ రాష్ట్ర ప్రజలకు స్టాలిన్ విజ్ఞప్తి చేశారు.

Related Posts

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉరవకొండ మన ధ్యాస: నిమ్న వర్గాల గౌరవానికి సంబంధించిన విషయం బలహీనవర్గాల విజయం అని తెలియజేసిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు యల్.నాగేంద్ర కుమార్ భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం ఉప రాష్ట్రపతి బాధ్యతలలో…

సర్పంచుల్లో ఉత్తముడు. వ్యాసాపురం సీతారాముడు.

ఉరవకొండ, మన న్యూస్: మండల పరిధిలోని వ్యాసాపురం సర్పంచ్ సీతారాములు ఉత్తమ సర్పంచుగా ఎంపికైన సంగతి విధితమే. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించి షాలు ఒక అప్పి పూలమాలలు వేసి మెమొంటోను బహుకరించారు. సర్పంచు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 1 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు