ఎస్‌టియు జిల్లా కౌన్సిల్ సమావేశం – విజయవంతం చేయండి

చిత్తూరు, మన ధ్యాస, డిసెంబరు-5: ఎస్‌టియు చిత్తూరు జిల్లా శాఖాధ్వర్యంలో జిల్లా కౌన్సిల్ సమావేశం డిసెంబర్ 7వ తేదీ, ఆదివారం నాడు చిత్తూరు పట్టణంలోని విజయం విద్యాసంస్థలు, పుత్తూరు రోడ్డు, హెరిటేజ్ పార్లర్ సమీపంలో నిర్వహించనున్నట్లు జిల్లా శాఖ అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్ యాదవ్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గ ఎన్నికలు చేపట్టబడనున్నాయి. ఎన్నికల పరిశీలకులుగా కడప జిల్లాకు చెందిన రాష్ట్ర నాయకులు బాలగంగి రెడ్డి, ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లాకు చెందిన ఎస్టియు అధ్యక్షులు హరి ప్రసాద్ రెడ్డి బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఒకే ఒక డి.ఏ మంజూరు చేసిన నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పన్నెండో వేతన సంఘం చైర్మన్ నియామకం, ముప్పై శాతం మధ్యంతర భృతి, ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన సుమారు ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిల విడుదల, ఉమ్మడి సేవా నియమావళి అమలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు, పి.ఎఫ్‌ మరియు ఏ.పీ.జి.ఎల్‌.ఐ రుణాల మంజూరు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి, సంక్రాంతి పండుగకు ముందుగా సమస్యలు పరిష్కరించుకోలేని పరిస్థితిలో భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్టియు రాష్ట్ర కార్యదర్శి గంటా మోహన్, రాష్ట్ర కార్యదర్శులు హేమచంద్రారెడ్డి, ము. మునెప్ప, పురుషోత్తం, దేవరాజు రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. అందువల్ల మండల, జిల్లా ఎస్టియు నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పత్రికా ప్రకటనలో కోరడమైనది.

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం