వరిగపల్లె పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్‌ – విద్యాభివృద్ధికి తొలి మెట్టు

యాదమరి, స్వర్ణసాగరం, డిసెంబరు-5: యాదమరి మండలంలోని వరిగపల్లె ప్రాధమిక పాఠశాలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ ఆకర్షణీయంగా, సందేశాత్మకంగా సాగింది. హెచ్‌.యం. జె. హిమబిందు సమన్వయంతో జరిగిన ఈ సమావేశం పాఠశాలలో విద్యార్థుల అభ్యాసం, సంక్షేమం, అభివృద్ధి పై తల్లిదండ్రుల్లో చైతన్యం పెంపొందించే వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ నాయకులు, వార్డు ఇన్‌చార్జి లక్ష్మీపతి, పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మీ, వైస్ చైర్మన్ శోభరాణి హాజరై విద్యా ప్రాధాన్యతను వివరించారు. హెచ్‌.యం. హిమబిందు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డోక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, తల్లికి వందనం వంటి పథకాలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి బలంగా దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగేందుకు ఉపాధ్యాయులు–తల్లిదండ్రులు కలిసి పనిచేయాలని ఆమె సూచించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల చురుకైన పాత్ర ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు. సమావేశం అనంతరం తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి రుచికరమైన భోజనాన్ని చేసుకుని స్నేహపూర్వక వాతావరణాన్ని మరింత బలోపేతం చేశారు. వైస్ చైర్మన్ శోభరాణి విద్యార్థులకు అరటిపండ్లు అందజేశారు. కార్యక్రమం విజయవంతంగా జరగడానికి టీచర్ అఖిలాండేశ్వరి, తల్లిదండ్రులు ప్రత్యేకంగా సహకరించారు. వరిగపల్లె పాఠశాల మెగా పేరెంట్స్ మీటింగ్‌ విద్యార్ధుల భవిష్యత్తుకు నూతన దిశగా నిలిచింది.

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం