ప్రతి గణిత విద్యార్థికి చిరస్మరణీయుడు‎లక్కోజు సంజీవరాయ శర్మ

యాదమరి, మన ధ్యాస డిసెంబర్-03: గణిత అపార ప్రజ్ఞాశాలి, అద్భుత మేధావి లక్కోజు సంజీవరాయ శర్మ వర్ధంతి సందర్భంగా, ఆయన గణిత ప్రతిభను ప్రతి విద్యార్థి ఆదర్షంగా తీసుకోవాలని సీనియర్ గణిత ఉపాధ్యాయులు కె. కనకాచారి పేర్కొన్నారు. పుట్టుకతోనే అంధుడైన సంజీవరాయ శర్మ చిన్నతనంలో అక్క చదివే 1–20 ఎక్కములు వింటూ గణితంపై ఆసక్తి పెంపొందించుకున్నారు. అక్క బడికి వెళ్లిన తరువాత స్వయంగా 22, 36 ఎక్కములు నేర్చుకొని అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. విద్యాభ్యాసం కోసం పాఠశాలకు వెళ్లకపోయినా, గణితాన్ని సాధనతో స్వయంగా అందిపుచ్చుకున్నారు. ఏ సంఖ్యనైనా ఇంకో సంఖ్యతో గుణించమంటే కేవలం కొన్ని సెకన్లలోనే సమాధానం చెప్పే ప్రతిభ సంజీవరాయ శర్మకు ఉండేది. ఉదాహరణకు 36,72,416 × 66,78412 వంటి మహా సంఖ్యల గుణాకార ఫలితాన్ని కూడా క్షణాల్లో చెప్పగలిగేవారు. ఈ అసాధారణ ప్రతిభతో ఆయన శ్రీకాళహస్తిలో పిడేలు విద్వాంసులుగా ప్రసిద్ధి చెందారు. వర్గాలు, ఘనాలు, పెద్ద సంఖ్యల లెక్కలు  ఏ గణిత సమస్య అయినా శకుంతలాదేవి కంటే ఒక సెకను ముందుగానే చెప్పే మహా ప్రావీణ్యం ఆయన సొంతం. గణితంపై ఆయనకున్న అపార ఏకాగ్రత, పట్టుదల, సాధన ఈ రోజూ విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఉపాధ్యాయులు కనకాచారి, భాస్కర్ రెడ్డి, రంగనాధం గుర్తుచేశారు. ఈ సందర్భంగా తరగతిలో విద్యార్థులకు ఆయన జీవిత విశేషాలను వివరించి, “పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే… సంజీవరాయ శర్మ దానికి ప్రత్యక్ష ఉదాహరణ” అని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం