ఎగువ మారేడుపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మహాదేశ్వర స్వామి విశేష చరిత్ర – భక్తుల సేవతో అభివృద్ధి

తవణంపల్లె, స్వర్ణసాగరం డిసెంబరు-01: చిత్తూరు జిల్లా, తవణంపల్లె మండలంలోని ఎగువ మారేడుపల్లి గ్రామంలో శ్రీ శ్రీ మహాదేశ్వర స్వామి ఆలయం భక్తిశ్రద్ధలతో అభివృద్ధి చెందుతోంది. 21.02.2020 మహాశివరాత్రి నాడు స్వయంభూగా వెలిసిన ఈ శివలింగం దర్శించడానికి తిరువన్నామలై గిరిప్రదక్షిణకు వచ్చే భక్తులు, గ్రామస్తులు, బెంగళూరు–తిరుపతి–చిత్తూరు ప్రాంతాల వాస్తవ్యులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమి నాడు అభిషేకాలు, చందన అలంకారం, ధూప–దీప–నైవేద్యాలు నిర్వహిస్తూ భక్తులు స్వామి సేవలో పాల్గొంటున్నారు. గత ఆరు సంవత్సరాలుగా కార్తీక దీపోత్సవం, మహాశివరాత్రి పర్వదినం ప్రత్యేక ఉత్సవాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ నిత్య పూజలను స్థానిక భక్తుడు మురళి నిర్వహిస్తున్నారు.
స్థల పురాణం:
స్థానిక భక్తుడు బాలాజీ అచారీ చిన్నతనం నుంచే ఆధ్యాత్మికతపై ఆసక్తి కనబరిచేవారు. తరచూ తిరువన్నామలై గిరిప్రదక్షిణ సమయంలో ధ్యానంలో మారేడుపల్లి కొండ ప్రాంతంలో శివస్వరూపం ఉన్నట్లు ఆయనకు దర్శనమిచ్చేది. కాలక్రమంలో మురళి అనే స్థానిక భక్తుడి పరిచయం వలన ఆ ప్రదేశం గురించిన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2020 మహాశివరాత్రి నాడు ధ్యానస్ఫూర్తితో కొండపై దొరికిన సర్పరూపంలో పాలించే స్వయంభూ శివలింగాన్ని భక్తులు కిందకు తీసుకువచ్చి, సాంప్రదాయబద్ధంగా ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఆలయం అభివృద్ధి చెందుతూ, భక్తులు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
ప్రతిష్ట అనంతర అద్భుతాలు: భక్తుల వాంగ్మూలాల ప్రకారం— సంతానం లేని వారికి సంతానం లభించడం, పెళ్లి కానివారికి వివాహాలు జరగడం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ అవకాశాలు రావడం, వంటి అనుభవాలు భక్తుల్లో విశ్వాసాన్ని మరింతగా పెంచాయి. ప్రతి పౌర్ణమి, ప్రతి శివరాత్రి, ప్రత్యేక పర్వదినాల్లో ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి.

స్వయంభూగా వెలిసిన శివలింగం

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం