అంతర్జాతీయ పురుషుల దినోత్సవం: విద్యార్థులకు విలువలు నేర్పిన కె.గొల్లపల్లె హైస్కూల్

యాదమరి, మన ధ్యాస నవంబర్ 19: యాదమరి మండలంలోని కె.గొల్లపల్లె హైస్కూల్‌ ప్లస్‌లో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ కార్యక్రమాన్ని హెడ్‌మిస్ట్రెస్ కం ప్రిన్సిపాల్ ఎ.పి. లలిత ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా నిర్వహించారు. పాఠశాల చివరి 30 నిమిషాలు ఈ వేడుకకు కేటాయించి, పురుష ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా వారికి బట్టలు, బహుమతులు, స్వీట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హెచ్‌.యం. లలిత మాట్లాడుతూ, “అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ప్రత్యేకత ఏమిటి, చరిత్రలో ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో లోకజ్ఞానం పెంపొందించడంతో పాటు పెద్దల పట్ల గౌరవభావం, తోటి వారిపట్ల మర్యాద, క్రమశిక్షణను అలవర్చేలా చేస్తాయి” అని పేర్కొన్నారు. ఇన్‌చార్జి భాస్కర రెడ్డి, సీనియర్ ఉపాధ్యాయులు కనకాచారి మాట్లాడుతూ, “అటువంటి వినూత్న కార్యక్రమాలు ఉపాధ్యాయులు – విద్యార్థుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని మరింత బలపరుస్తాయి. మంచి విద్యాభ్యాసం సాగడానికి ఇవి దోహదం చేస్తాయి” అని సంయుక్తంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 17 మంది పురుష ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
‎అలాగే ఉపాధ్యాయులు — భాస్కర రెడ్డి, కనకాచారి, మధుసూధన్, మధన్ మోహన్ రెడ్డి, దామోదర రెడ్డి, సుధాకర్, మహేష్ షణ్మగం, చిన్నదొరై, రాకేష్ రంగనాధం, చిట్టిబాబు, నాగభూషణం, రాజా, శరత్, హేమంత్, ఆషా, కె.భారతి, మంజుల, మంజులత, భారతి, రాజేశ్వరి, రమాదేవి, కుమారి హిమబిందు, అరుణ, అక్తర్, శర్మిల, హేమాకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర