నూతన మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలి : ఎస్‌టి యూ డిమాండ్

గుడిపాల మన ధ్యాస సెప్టెంబర్-16 చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని జెడ్‌పి హెచ్‌ఎస్ నరహరి పేట, శ్రీరంగంపల్లి, బొమ్మసముద్రం, కమ్మతిమ్మపల్లి తదితర పాఠశాలల్లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల పాఠశాల విద్యాశాఖ ప్రవేశపెట్టిన నూతన మూల్యాంకన విధానం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆచరణ సాధ్యం కానిది అని అన్నారు. ఎక్కువ సమయం పాఠ్యాంశాల బోధనకు కాకుండా, మూల్యాంకన పుస్తకాల నింపే పనిలోనే వృథా అవుతుందని, దీనివల్ల సకాలంలో పాఠ్యక్రమం పూర్తి చేయలేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కావున పాత మూల్యాంకన విధానాన్ని మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ముప్పై వేల కోట్ల ఆర్థిక బకాయిలను దశల వారీగా ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాలని, సరెండర్ సెలవు నగదు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డి.ఏ.ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా మహిళా కార్యదర్శి రాధాకుమారి, సంఘ నాయకులు గుణశేఖర్, సుబ్రహ్మణ్యం పిళ్లె, మునస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

శ్రీబాగ్ ఒప్పందం అమలు కోరుతూ కర్నూలులో న్యాయవాదుల నిరసన

ఉరవకొండ మన ధ్యాస: శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో న్యాయవాదులు మంగళవారం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. “హైకోర్టు సాధన సమితి” ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో న్యాయవాదులు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని గట్టిగా డిమాండ్…

కరువు భత్యం, మధ్యంతర భృతి ప్రకటించాలని ఎస్.టి.యు డిమాండ్

చిత్తూరు రూరల్ మన ధ్యాస సెప్టెంబర్-16‎చిత్తూరు రూరల్ మండలంలోని సికేపల్లి, బంగారెడ్డిపల్లి, నర్సింగరాయనపేట, తాళంబేడు, చెర్లోపల్లి, ఏం అగ్రహారం, దొడ్డిపల్లి తదితర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

శ్రీబాగ్ ఒప్పందం అమలు కోరుతూ కర్నూలులో న్యాయవాదుల నిరసన

శ్రీబాగ్ ఒప్పందం అమలు కోరుతూ కర్నూలులో న్యాయవాదుల నిరసన

ప్రజల సమస్యలే లక్ష్యం..పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ “

  • By NAGARAJU
  • September 16, 2025
  • 1 views
ప్రజల సమస్యలే లక్ష్యం..పరిష్కారమే ధ్యేయం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ “

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

  • By RAHEEM
  • September 16, 2025
  • 8 views
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

కరువు భత్యం, మధ్యంతర భృతి ప్రకటించాలని ఎస్.టి.యు డిమాండ్

కరువు భత్యం, మధ్యంతర భృతి ప్రకటించాలని ఎస్.టి.యు డిమాండ్

నూతన మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలి : ఎస్‌టి యూ డిమాండ్

నూతన మూల్యాంకన విధానాన్ని రద్దు చేయాలి : ఎస్‌టి యూ డిమాండ్

పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…

పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావాలి…