మక్తల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : మక్తల్ నియోజక వర్గ కేంద్రంలోని ప్రభుత్వ సీ హెచ్ సీ ( సామాజిక ఆరోగ్య కేంద్రం) ని బుధవారం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ప్రసూతి గది, స్కానింగ్, ల్యాబ్, డయాలసిసి సెంటర్,జనరల్ వార్డు, డ్రగ్స్ స్టోర్ ను ఆమె పరిశీలించారు. ఆస్పత్రిలో నెలకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ల్యాబ్ కు వెళ్లిన కలెక్టర్ అక్కడ రోజుకు ఎన్ని రక్త పరీక్షలు, ఎలాంటి పరీక్షలు చేస్తున్నారని, టీబీ నిర్ధారణ పరీక్షలు ఎంత మందికి చేస్తున్నారని, టీబీ కోసం సేకరించిన నమూనాలకు ఎక్కడ స్టోర్ చేస్తున్నారని, చేసిన పరీక్షల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు. డయాలసిస్ సెంటర్ లోకి వెళ్ళి ఎన్ని బెడ్స్ ఉన్నాయని, ఎంతమంది డయాలసిస్ చేసుకుంటున్నారనే వివరాలను తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేయించాలని, మరుగు దొడ్ల తలుపులను మరమ్మతు చేయించాలని మున్సిపల్ కమిషనర్ శంకర్ కు సూచించారు. అనంతరం జనరల్ వార్డుకి వెళ్ళి రోగులతో వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఓపీ విభాగానికి వెళ్లి రోజుకు ఎంత మంది అవుట్ పేషంట్స్ వస్తుంటారని అక్కడి వైద్య సిబ్బందిని ప్రశ్నించగా 200 నుంచి 300 మంది దాకా అవుట్ పేషంట్స్ వస్తుంటారని సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. ఆస్పత్రిలో నమోదు అవుతున్న సీజనల్ వ్యాధుల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ కేసులేమీ లేవు కదా అని ప్రశ్నించగా ఇప్పటిదాకా వైరల్ ఫీవర్ కేసులే ఎక్కువగా నమోదు అయ్యాయని సిబ్బంది తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత అవసరం అన్నారు. చివరగా డ్రగ్స్ స్టోర్ కి వెళ్ళి నిల్వ ఉన్న మందులను పరిశీలించారు. డ్రగ్స్ కాల పరిమితి ఎలా తెలుస్తుందని డ్రగ్స్ స్టోర్ ఫార్మాసిస్టు ను అడగడంతో డ్రగ్స్ వచ్చినప్పుడు తాము రిజిస్టర్ తో పాటు కంప్యూటర్ లోనూ నమోదు చేస్తామని, మందుల నిల్వ ను బట్టి కాల పరిమితి ముగిసిన వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామని ఫార్మాసిస్టు కలెక్టర్ కు తెలిపారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
మదర్ ల్యాండ్ సొసైటీ స్వచంద సంస్థ ఆధ్వర్యం హెచ్ ఐ వి/ ఎయిడ్స్ , మత్తు పదార్దాల వినియోగం పై అవగాహన కార్యక్రమం

రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

  • By JALAIAH
  • September 10, 2025
  • 2 views
రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గిద్దాం నానో యూరియా ఎరువులను అలవాటు చేసుకుందాం..!

నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

  • By RAHEEM
  • September 10, 2025
  • 6 views
నాయక్ పోడు కులస్థుల రాస్తారోకో…కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తహసీల్దార్..

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 7 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 7 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు