కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

కలిగిరిమన న్యూస్ : కలిగిరి ప్రాథమిక వైద్యశాల డాక్టర్లపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని కలిగిరి మండల అధ్యక్షురాలు ముట్టుకూరు శిరీష రెడ్డి ఎంపీడీవో ప్రత్యూషను కోరారు. కలిగిరి మండల సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 11:30 నిమిషాలకు కలిగిరి ఎంపీడీవో కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో ప్రత్యూష అధ్యక్షత వహించగా ఎంపీపీ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్నీ శాఖల అధికారులు, సర్పంచులు, ప్రాదేశిక సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, జడ్పిటిసి సభ్యులు పాల్గొనాల్సి ఉంది. అయితే బుధవారం జరిగిన కార్యక్రమానికి అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ మొక్కుబడిగా హాజరై మండల సమావేశం జరిగిందని పంపించారు. ఆశించిన స్థాయిలో సభ్యులు హాజరు కాలేదు. ఇది ఇలా ఉంటే కలిగిరి ప్రాథమిక వైద్య కేంద్రాన్ని 24 గంటల వైద్యశాలగా మార్చి అక్కడ ఇద్దరు డాక్టర్లను తగినంతమంది సిబ్బందిని ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. అయితే గత మూడు సర్వసభ్య సమావేశాల నుండి కలిగిరి వైద్యాధికారులు సమావేశాలకు హాజరు కాకుండా వారి సిబ్బందిని మాత్రమే సమావేశాలకు పంపుతున్నారని దీనివలన సమావేశంలో వివరించాల్సిన అంశాలను వైద్యాధికారి రానందువలన ప్రజాప్రతినిధులకు చేరవేయలేకపోతున్నామని ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యశాలలో ఇద్దరు వైద్యాధికారులు ఉన్న సమావేశాలకు డుమ్మా కొట్టడం ఏంటని ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వైద్యాధికారి విధులకు సైతం సక్రమంగా హాజరు కావడం లేదని ఆరోపణలు ఉన్నాయని ఎంపీపీ మండిపడ్డారు. వైద్యాధికారులు విధులకు హాజరు కాకుండానే సంతకాలు చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇలాంటి అధికారిపై వెంటనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయాలంటూ ఎంపీడీవో కి తెలిపారు. అదేవిధంగా సర్వసభ్య సమావేశానికి హాజరు కానీ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణం చల్లగా ఉండి వర్షాలు పడుతున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు గ్రామాల్లో తిరగాలని ప్రజలకు కూడా ఇళ్లల్లో నీటిని నిలువ లేకుండా చూసుకోవాలన్నారు. రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందజేయాలని వ్యవసాయ అధికారులకు తెలియజేశారు.

  • Related Posts

    మంత్రి స్వామి ఆదేశాలతో పెదనపాలెం బావి పరిశీలించిన ఎంపీడీవో

    మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి పంచాయతీ పరిధిలోని పెదనపాలెం గ్రామంలో ఉన్న మంచినీటి బావిని ఎంపీడీవో గురువారం సందర్శించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారి…

    తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకటేష్ చౌదరి ఏకగ్రీవం..

    మన న్యూస్ తవణంపల్లె జులై-10 పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంపిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. గురువారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలో గల పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షతన తవణంపల్లె…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    మంత్రి స్వామి ఆదేశాలతో పెదనపాలెం బావి పరిశీలించిన ఎంపీడీవో

    మంత్రి స్వామి ఆదేశాలతో పెదనపాలెం బావి పరిశీలించిన ఎంపీడీవో

    తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకటేష్ చౌదరి ఏకగ్రీవం..

    తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకటేష్ చౌదరి ఏకగ్రీవం..

    కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

    కలిగిరి వైద్యాధికారిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేయండి ఎంపిపి మెట్టుకూరి శిరీషా రెడ్డి..!!!

    మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

    మండల సమావేశాలకు సభ్యులు రారు,, అధికారులు లేరు ??

    గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

    గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

    విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

    విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు