పెద్దపాడు లోని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి ఆదేశాల మెరకు రాష్ట్ర తెలుగు రైతు కార్య నిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు గారి ఆధ్వర్యంలో జోరుగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం..!!!!

మనన్యూస్,కలిగిరి : కలిగిరి మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీ లో బుధవారం రాత్రి జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం లో రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
పెద్దపాడు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు నీరాజనాలు పలికారు. బొల్లినేని వెంకట రామారావు, ఇంటింటికి తిరుగుతూ సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం బొల్లినేని వెంకట రామారావు, ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతూ, ఇంటింటికి తిరిగారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటికి పరిష్కారం మార్గాలను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కారం మార్గాలను చూపుతామని తెలియజేశారు. అనంతరం గ్రామ మహిళలు తో మాట్లాడుతూ, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం లో అభివృద్ధి సంక్షేమ పథకాలకు కొరవలేదు, అన్ని పథకాలు అందుతున్నాయి అంటూ, ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గం అగ్రగామిగా నిలుస్తుందని, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారి సారథ్యంలో ఉదయగిరి సిరుల గిరిగా అభివృద్ధి చెందుతుందని ఇందులో ఎలాంటి సందేహం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా పెద్ద కొండూరు గ్రామపంచాయతీ కీ సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో చేయిస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు వెల్లంకి కొండప నాయుడు, మాజీ సర్పంచ్ మొక్క హజరత్ రావు, రాయల కొండప నాయుడు, ఇరుపునేని రవీంద్ర, ద్రోణాదుల సురేష్, మన్నేపల్లి వెంకట్రావు, ఈరుపునేని రామాంజనేయులు, కాట్రగుంట అశోక్, చావ సునీల్, ద్రోణాదుల శివరాం, మరియు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

    బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

    అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

    అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

    మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!

    మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!