

ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయి
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్లు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులను కాలరాస్తూ bకార్మికుల చట్టాలను కుదించి వేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందన్నారు అందులో భాగంగానే అంగన్వాడీలకు ప్రైవేట్ కార్మికులకు ఔట్సోర్సింగ్ వర్కర్లకు కనీస వేతనాలు చట్టం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు రైతులకు నల్ల చట్టాలను తీసుకొచ్చి పరిశ్రమల పేరుతో అతి తక్కువ రేటుకు రైతుల భూములను ప్రైవేటీకరణ చేయడం జరుగుతుందన్నారు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యవసాయ కార్మికులు పేదలకు ఉపాధి హామీ చట్టం ఒక వరం లాగ ఉన్నదన్నారు అలాంటి చట్టాన్ని తూట్లు పొడిచి అవినీతి అక్రమాల పేరుతో నిధులను తగ్గించి నెలలు తరబడి చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్వి నాయుడు హమాలీ యూనియన్ నాయకులు గోపాల్ వ్యవసాయ కార్మిక సంగం నాయకులు మురళి వీరాంజనేయులు రైతు సంఘం నాయకులు జ్ఞానమూర్తి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పంచాయతీ వర్కర్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు