రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశంవైఎస్ఆర్సిపి చైతన్యంతో ముందుకు సాగాలి – మరి చెర్ల గంగారావు.

రాజాం,మన న్యూస్ , జూలై 9: రాజాం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన వైఎస్ఆర్సిపి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు మరి చెర్ల గంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అధికారమే గానీ ప్రతిపక్షమే గానీ – రెండూ ఒకే నాణానికి బొమ్మ బోరుసుల వంటి‌వి. సమానమైన చైతన్యంతో పనిచేయగలిగితేనే విజయాన్ని సాధించగలము,” అన్నారు.ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల మనస్సుల్లో స్థిరపడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి అని పేర్కొన్న ఆయన, “సంస్థను రక్షించగలిగినప్పుడే అది మనల్ని రక్షిస్తుంది. వైఎస్ఆర్సిపి ఒక సామాజిక బాధ్యత కలిగిన రాజకీయ సంస్థ. అందుకే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది,” అని తెలిపారు.కార్యకర్తలు నిరాశ చెందకుండా, విశ్వాసంతో, ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటం జరిపితే ప్రజల మన్ననలు పొందవచ్చు. తద్వారా మళ్లీ అధికారం లోకి రావడం సహజమవుతుందని చెప్పారు.ఈ సమావేశానికి రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్‌చార్జి డాక్టర్ తలె రాజేష్ అధ్యక్షత వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

మన న్యూస్: రాయదుర్గం నియోజకవర్గం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 11న (శుక్రవారం) మధ్యాహ్నం 2:00 గంటలకు ఉడేగోళం మద్దినేశ్వర స్వామి కళ్యాణ మండపంలో సర్వసభ్య విస్తృత సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ…

కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

ఉరవకొండ, మన న్యూస్:నాలుగు కోడ్ లను నిరసిస్తూ వివిధ సంఘా ల నేతలు ర్యాలీ చేసాయిఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ వి నాయుడు అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎల్పర్స్ యూనియన్ నాయకులు హమాలీ యూనియన్ నాయకులు పంచాయతీ కార్మికులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

కేంద్రం కార్మిక హక్కుల కాలరాసింది.వ్యతిరేక నిరసన

అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

అన్ని పాపాలకు బాధ్యుడు ప్రధాని నరేంద్ర మోడీ.-స్మార్ట్ మీటర్ల బిగింపు పై అందరిదీ ఒకటే దారి: సిపిఎం విరుపాక్షి.

మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!

మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కు ఘన స్వాగతం పలికిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు..!!