ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలి…మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం తగదు-మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ..

మన న్యూస్,తిరుపతి :– కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై జగన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం సుగుణమ్మ ఇంటిముందు పార్టీ నాయకులు కార్యకర్తలతో ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వాక్యాలు వైసిపి దిగజారుడుతనానికి పరాకాష్టాన్ని దుయ్యపెట్టారు. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అస్లీల పదజాలాన్ని ఖండించడానికి కూడా జగన్ రెడ్డి ముందుకు రాకపోవడం మహిళలను అవమానించడమే అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సొంత కుటుంబ సభ్యులు స్వాగతిస్తారా అని ప్రశ్నించారు. మహిళలను కించపరిచే అడుగడుగున అవమానపరిచే నీచ సంస్కృతి జగన్ రెడ్డి పార్టీకే తగునని పేర్కొన్నారు. సొంత చెల్లెలు షర్మిల చీర కట్టుకోవడం పైన జగన్ రెడ్డి అండ్ కో విమర్శలు చేశారని గుర్తు చేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వైసిపి నేతలపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాట్లాడుతూ రాజకీయాలలో మహిళలు లాగే సంస్కృతి వైసిపి తోనే మొదలైందని ప్రజలు తగిన బుద్ధి చెప్పి 11 సీట్లకే పరిమితం చేసిన వారికి బుద్ధి రాలేదన్నారు. మహిళలపై నీచంగా వ్యాఖ్యలు చేసిన వైసిపి నేతలపై ఏనాడు ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జగన్ రెడ్డి సొంత బాబాయ్ హత్య కేసులో న్యాయం చేయమని ప్రశ్నించినందుకు వైయస్ సునీత రెడ్డి పై ఆస్తిలో న్యాయబద్ధమైన వాటా అడిగినందుకు వైయస్ షర్మిలపై సోషల్ మీడియాలో అత్యంత నీచంగా పోస్టులు పెట్టించారన్నారు. వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వాక్యాలకు జగన్ రెడ్డి బేసరత్తుగా మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ కరాటే చంద్ర, టిడిపి తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి మునిశేఖర రాయల్, టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్లు బాలసుబ్రమణ్యం రెడ్డి, రామ్మూర్తి రాయల్, రజక సంఘం నేత అశోక్, మేడికుర్తి విశ్వనాథ్ మహిళలు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి;- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాలలు, మండల‌ పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ ప్రాధమిక పాఠశాలు, జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

_ రెఫరల్ చైర్మన్ స్లెస్సర్ బాబు శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- విద్యార్థులకు ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మపేట రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్, రెఫరల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

దత్తాత్రేయ దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!