
మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రవణ్ కుమార్ ను ఆ పార్టీ ఉపాధ్యక్షులు దాడిశెట్టి వీరబాబు ఘన స్వాగతం పలికారు. మాజీమంత్రి వైసిపి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం నివాసం వద్దకు బయలుదేరిన జడ శ్రావణ్ కుమార్ ను యర్రవరంవద్ద జాతీయ రహదారిపై దాడిశెట్టి వీరబాబు పార్టీ శ్రేణులతో సాలువ కప్పి స్వాగతం పలికారు. అనంతరం ప్రత్తిపాడు లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జోహార్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేపట్టారు. శ్రావణ్ కుమార్ వెంట భారీ కాన్వాయ్ తో ముద్రగడ నివాసానికి బయలుదేరి వెళ్లారు.