శ్రీమతి నారా భువనేశ్వరి – ఒక నిశ్శబ్ద ధైర్యం-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- కష్టాలకు వెరవని ధైర్యం, సమాజాన్ని సొంత కుటుంబంలా ప్రేమించే తత్వం, మహిళా జాతికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నారా భువనేశ్వరమ్మ ఒక నిశ్శబ్ద ధైర్యం అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన నందమూరి తారక రాముని కుమార్తె, తెలుగువారి ఆత్మవిశ్వాసానికి స్పూర్తి ప్రదాత నారా చంద్రబాబు ధర్మపత్ని, తెలుగువారి భవిష్యత్తు పై భరోసా కల్పించిన నాయకుడు నారా లోకేష్ మాతృమూర్తి శ్రీమతి నారా భువనేశ్వరి కి 65 వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని, భువనమ్మకు దివ్యాశీస్సులు అందించమని జయరాం రావు వీధి లోని శ్రీ శీతలాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతూ, ఆర్తులకు అండగా ఉంటూ తల్లి లాంటి ఆప్యాయతను చూపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిండు నూరేళ్ళు దీర్ఘసుమంగళిగా జీవించాలని కోరుకుంటూ పూజలు చేశారు.
బిసి తేజం రవీంద్రుని కోసం ప్రార్ధనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి,మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు,బిసి తేజం కొల్లు రవీంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని వారి పేరున కూడా అమ్మవారికి ప్రత్యేకంగా అర్చనలు చేయించడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వంలో తీవ్రమైన అణచివేతను, నిర్బంధాన్ని ఎదుర్కొన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తక్షణమే వారి వద్దకు వచ్చి అండగా నిలిచిన బిసిల పాలిట ఛత్రపతి మన రవీంద్రన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్,వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,
తిరుపతి పార్లమెంటు నాయకులు బీమాల భాస్కర్, సంజాకుల మురళీకృష్ణ, పూల శేఖర్, రమేష్, మల్లికార్జున, విద్యుత్ సంస్థ ఉద్యోగ సంఘ నాయకుడు ముని కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

మన న్యూస్,తిరుపతి:తమిళనాడు రాష్ట్రం మదురైలో హిందూ మున్నానీ సంస్థ నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం విమానాశ్రయంకు చేరుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆరణి మదన్. తిరుపతి నుంచి సభలో పాల్గొనేందుకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు