శ్రీమతి నారా భువనేశ్వరి – ఒక నిశ్శబ్ద ధైర్యం-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- కష్టాలకు వెరవని ధైర్యం, సమాజాన్ని సొంత కుటుంబంలా ప్రేమించే తత్వం, మహిళా జాతికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన నారా భువనేశ్వరమ్మ ఒక నిశ్శబ్ద ధైర్యం అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన నందమూరి తారక రాముని కుమార్తె, తెలుగువారి ఆత్మవిశ్వాసానికి స్పూర్తి ప్రదాత నారా చంద్రబాబు ధర్మపత్ని, తెలుగువారి భవిష్యత్తు పై భరోసా కల్పించిన నాయకుడు నారా లోకేష్ మాతృమూర్తి శ్రీమతి నారా భువనేశ్వరి కి 65 వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని, భువనమ్మకు దివ్యాశీస్సులు అందించమని జయరాం రావు వీధి లోని శ్రీ శీతలాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా వేల కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపుతూ, ఆర్తులకు అండగా ఉంటూ తల్లి లాంటి ఆప్యాయతను చూపుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి నిండు నూరేళ్ళు దీర్ఘసుమంగళిగా జీవించాలని కోరుకుంటూ పూజలు చేశారు.
బిసి తేజం రవీంద్రుని కోసం ప్రార్ధనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి,మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు,బిసి తేజం కొల్లు రవీంద్ర జన్మదినాన్ని పురస్కరించుకొని వారి పేరున కూడా అమ్మవారికి ప్రత్యేకంగా అర్చనలు చేయించడం జరిగింది. గత వైసిపి ప్రభుత్వంలో తీవ్రమైన అణచివేతను, నిర్బంధాన్ని ఎదుర్కొన్న బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తక్షణమే వారి వద్దకు వచ్చి అండగా నిలిచిన బిసిల పాలిట ఛత్రపతి మన రవీంద్రన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్,వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి సోషల్ మీడియా కన్వీనర్‌ కోట చంద్రశేఖర్,
తిరుపతి పార్లమెంటు నాయకులు బీమాల భాస్కర్, సంజాకుల మురళీకృష్ణ, పూల శేఖర్, రమేష్, మల్లికార్జున, విద్యుత్ సంస్థ ఉద్యోగ సంఘ నాయకుడు ముని కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 2 views
ఇతర రాష్ట్రాల సన్నధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి…అదనపు కలెక్టర్ విక్టర్

రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
రాజకీయ ప్రతినిధులకు ఎన్నికలపై శిక్షణ..జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ వి. విక్టర్

నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
నిజాంసాగర్ ఎంపీడీవోగా డీ. శివ కృష్ణ బాధ్యతలు స్వీకరణ…

ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

  • By RAHEEM
  • October 29, 2025
  • 4 views
ఇందిరమ్మ ఇండ్లను త్వరితగతిన పూర్తిచేయాలి—ప్రత్యేక అధికారి అరుణ

దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

  • By RAHEEM
  • October 29, 2025
  • 3 views
దాబా నిర్వహికుడిపై కేసు నమోదు…50 వేల జరిమానా..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 8 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్