

మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలోని పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మలా కుమారి హాజరయ్యారు. మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రారావు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం లో భాగంగా రైతులు ఈ కేవైసీ చేయించవలసి ఉన్నదని కానీ ప్రభుత్వం వారు సమయపాలనను దృష్టిలో ఉంచుకొని ఇతర వనరుల ద్వారా ఈ కేవైసీ నమోదు ప్రక్రియను పూర్తి చేయడం జరిగినదని, ఇంకా ఏమైనా అన్నదాత సుఖీభవ మీద రికార్డ్స్ రాకపోయినట్లయితే సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించవలసిన దిగా కోరి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది వెంకటనారాయణ పాల్గొని ప్రకృతి వ్యవసాయం గురించి వివరించడం జరిగినది, మరియు కార్యక్రమంలో సింగరాయకొండ ఎఈవో షేక్ జహీర్ కూడా పాల్గొన్నారు