తల్లుల కష్టాలు తీర్చేవాడు చంద్రన్న-బిసి విభాగం,తెలుగుదేశం పార్టీ.

శ్రీకాళహస్తి, మన న్యూస్.చాలీచాలని ఆదాయంతో కుటుంబ పోషణ కోసం కష్టాలు పడుతూ, తమ పిల్లల చదువులు కోసం ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న తల్లుల కష్టాలు తీర్చే వాడు మన చంద్రన్న అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు.గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రకటించిన *సూపర్ సిక్స్* పధకాల లో ఒకటైన తల్లికి వందనం హామీ ని నెరవేరుస్తూ ఈ నెల పన్నెండవ తేదీన డబ్బులు పిల్లల తల్లుల ఖాతాలోకి జమ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని,కృతజ్ఞతగా స్థానిక 18 వార్డు, పూసల వీధిలో గల లబ్దిదారుల ఇంటి వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంతోషం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని, రాష్ట్రంలో ఉన్న తల్లుల ఖాతాల్లో, “తల్లికి వందనం” పధకం కింద ఒకే రోజు రూ.10 వేల కోట్లు జమ చేసి ఎన్డీయే కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని కొనియాడారు.’తల్లికి వందనం’ పిల్లల చదువులకు ఇం’ధనం’గా ఉపయోగపడటంతో తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని, నలుగురు పిల్లలు ఉన్న షేక్ ఆశ అనే తల్లి ఖాతాలో ఒక్కో పిల్లవాడికి 13,000/- చొప్పున తన నలుగురు పిల్లలకు సంబంధించిన 52,000/- జమ అయ్యింది అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ పిల్లల విద్యాభ్యాసం కొరకు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న తమలాంటి పేద, మధ్యతరగతి కుటుంబాల వారికి అండగా నిలిచి, తమ కుటుంబంలో చదువుకుంటున్న ప్రతీ పిల్లవాడికి పదమూడు వేల రూపాయలు *తల్లికి వందనం* పేరుతో తమకు అందించిన చంద్రబాబు నాయుడు కి, పవన్ కళ్యాణ్ కి, నారా లోకేష్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో గల తల్లుల ఆశీస్సులు ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి చిరస్థాయిగా ఉంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరధాచారి, వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి,తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,శ్రీకాళహస్తి పురపాలక సంఘం 18 వ వార్డు మాజీ కౌన్సిలర్లు డా.నివేదిత మోరె, షేక్ మహబూబ్ భాషా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మునిరాజా యాదవ్,వజ్రం కిషోర్,సయ్యద్ చాంద్ భాషా,కోట చంద్రశేఖర్,బీమాల భాస్కర్, మణి,మురళీ నాయుడు,మహ్మద్ రఫీ,నూర్ మొహమ్మద్,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

మన న్యూస్,తిరుపతి:తమిళనాడు రాష్ట్రం మదురైలో హిందూ మున్నానీ సంస్థ నిర్వహించిన మురుగన్ భక్తుల మహానాడులో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం విమానాశ్రయంకు చేరుకున్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఆరణి మదన్. తిరుపతి నుంచి సభలో పాల్గొనేందుకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు

జాగృతిని అన్ని జిల్లాలో విస్తరింపజేయాలి ఎమ్మెల్సీ కవిత – హైద్రాబాద్ లో వారి సగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన ఉద్యమకారులు