ఏడాదిలోనే విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలకు మంత్రి లోకేష్ నాంది పలికారుమంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి

విద్యకే కూటమి ప్రభుత్వం పెద్దపీట

ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం

షైనింగ్ స్టార్స్ అవార్డులతో పేద విద్యార్థులకు ప్రోత్సాహం

సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన మంత్రి

మన న్యూస్ సింగరాయకొండ:-

విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు ప్రభుత్వ పాఠశాలలో గురువారం నాడు సాంఘిక మంత్రి సన్నబియ్యంతో మధ్యాహ్నం భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ….. పేద విద్యార్థులకు విలువలతో కూడిన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం సన్న బియ్యంతో అన్నం పెడతామని చెప్పి పేదల ఆశలకు సున్నం పెట్టారని దుయ్యబట్టారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచారన్నారు. విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పించారని కొనియాడారు. ప్రాథమిక పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టారన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం తల్లికి వందనం పథకం అమలు చేశామన్నారు.షైనింగ్ స్టార్స్ అవార్డులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ 20వేల ప్రైజ్ మనీ తో ప్రోత్సహిస్తూ వారిలో సాధించాలనే పట్టుదలను పెంచుతున్నామని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.

Related Posts

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను అండగా ఉంటానని యువ నాయకుడు పైనేని మురళి అన్నారు. బుధవారం ఎస్ ఆర్ పురం మండలం ఎన్ ఆర్ పురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లోకయ్య…

వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి (అపురూప్):- మెట్ట ప్రాంత రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించిన ఘనత దివంగత నేత స్వర్గీయ వరుకుల రాజాకే చెందుతుందని రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు ( శివ) కొనియాడారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

ఆర్థిక ఇబ్బందుల్లో 1962 సిబ్బందినెలల తరబడి జీతాలు రాక

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

తెలుగుదేశం పార్టీ నాయకుడిని పరామర్శించిన యువ నాయకుడు పైనేని మురళి

వెన్న శివ ఆధ్వర్యంలో వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

వెన్న శివ ఆధ్వర్యంలో  వరుపుల సాయి తర్సిత్ పుట్టినరోజు వేడుకలు…

జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

జిల్లా సర్వసభ్య సమావేశం విజయవంతం చేయండి..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం విద్యార్థులు శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి ఎంపిక…

సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ

సీఎం సహాయ నిధి చెక్కులను – ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పంపిణీ