

ఎస్ఆర్ పురం, మన న్యూస్...రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గంగాధర నెల్లూరు నియోజకవర్గ యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సూచనల మేరకు ఎస్ఆర్ పురం మండలం మంగుంట పంచాయతీలో నూతన రేషన్ షాపును మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భూపతిరెడ్డి మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో రేషన్ బియ్యం పంపిణీ చేయడానికి వ్యాన్లను కొనుగోలు చేశారు రేషన్ బియ్యాన్ని ఆ వ్యాన్ల ద్వారా గోల్మాల్ చేసేవారు.. దీనిపై తెలుగుదేశం ప్రభుత్వం వ్యాన్లను రద్దు చేసి షాపుల ద్వారానే చేస్తారు అలాగే వికలాంగులు వృద్ధులకు ఇంటివద్దె బియ్యం అందిస్తారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆనంద్ రెడ్డి వెంకటేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.