

మన న్యూస్,తిరుపతి :– జిల్లా వ్యాప్తంగా నేరాలను కట్టడి చేసేందుకు పోలీసుల చే రాత్రింబవళ్లు ప్రత్యేక నిఘ కు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీకారం చుట్టారు. గత మే నెల ఒకటో తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా నేరాలను చార వరకు నియంత్రించడంలో జిల్లా పోలీసులు సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు పోలీస్ అధికారులకు ఇస్తూ వారిని అప్రమత్తం చేసి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లాలో అసాంఘిక శక్తులపై గట్టి నిఘా పెట్టారు. రాత్రిపూట రోడ్లపై తిరుగుతున్న అనుమానిత వ్యక్తులపై స్పెషల్ పార్టీ పోలీసులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకొని పూర్తిస్థాయిలో విచారించిన తర్వాతే విడిచిపెట్టుతున్నారు. ఎవరైనా జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలకు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. గత నెలలో రోడ్లపై తిరుగుతున్న 1997 మంది అనుమానితులను స్టేషన్లకు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి సుమారు 43 కేజీల గంజాయిని సీట్ చేయడం జరిగింది. జిల్లాలో ఉన్న 67 మంది రౌడీ షీట్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే 19 ప్రదేశాలను గుర్తించి వాటిని శుభ్రం చేయించడం జరిగింది. జిల్లావ్యాప్తంగా 279 వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి రోడ్లకు ఇరువైపులా ఆక్రమించి ట్రాఫిక్ అంతరాయం కలిగించే చిరు వ్యాపారులపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కేసులను నమోదు చేసి కోర్టులో జరిమానాలు విధించడంతోపాటు శిక్షలు వేయించారు. జిల్లావ్యాప్తంగా డీఎస్పీలు సిఐలు ఎస్సైలు తమ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సమస్య ఆత్మక గ్రామాలను సందర్శించి ప్రజలతో ముఖాముఖి చర్చించి వారికి పోలీసు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక ఆపరేషన్లు : జిల్లాలో ఇటువంటి అత్యధిక డ్రోన్ కెమెరాల ద్వారా 68 ఆపరేషన్ లను నిర్వహించి విజయవంతం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న పార్కులలో వృద్ధులతో చర్చించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో చర్యలు తీసుకోవడం జరిగింది. 112 గ్రామాలలో పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించి చట్టాలపై అవగాహన కార్యక్రమాలు చిన్న పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. జిల్లాలో అనధికారికంగా పోలీసు నిబంధనలు పాటించని 494 హోమ్ స్టే లను తనిఖీ చేసి వారికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. జిల్లాలో 13 ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి 525 రికార్డు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ క్రైమ్, లోన్ యాపులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. ఇది ఏమైనా జిల్లాలో ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ హెచ్చరించారు.