

వెదురుకుప్పం మన న్యూస్: మండలంలోని గొడుగుచింత లోని షాప్ నెంబర్ 4 ను నిత్యవసర సరుకులు చౌక దుకాణంను మండల రెవెన్యూ అధికారులతో కలిసి డీలర్ కే ఝాన్సీ, స్థానిక టిడిపి నేత, మాజీ సర్పంచ్ భాస్కర్ నాయుడు మరియు మధు, జనసేన నాయకుడు నక్కా ముని చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ ల ఆలోచనతోనే అన్ని వర్గాల ప్రజలకు నిత్యవసర సరుకులు తీసుకునే వెలుసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ప్రతినెల ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం8 గంటల నుండి మధ్యాహ్నం12 గంటల వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. పైన తెలిపినటువంటి సమయంలో డీలర్ కే.ఝాన్సీ అందుబాటులో ఉండి పంచాయతీలోని రేషన్ కార్డుదారులందరికీ బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కావున పంచాయతీలోని రేషన్ కార్డు కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా మధు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇస్తామని ముసుగులో నిత్యవసర సరుకులు పక్కదారి పట్టాయి అన్నారు. అలా జరగకూడదని అర్హుతులైన రేషన్ కార్డుదారులందరికీ నిత్యవసర సరుకులు అందేలా కొత్త విధానాన్ని ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి ప్రవేశపెట్టారు అన్నారు. అలాగే ఎవరికైనా నిత్యవసర సరుకులు వద్దు అనుకున్న వారికి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్ ఐ, వీఆర్వో నరసింహారెడ్డి, వీఆర్ఏ రామ్మూర్తి, టిడిపి నాయకులు భాస్కర్ నాయుడు, మధు, దాము, జనసేన నాయకుడు నక్క ముని, గ్రామస్తుల తదితరులు పాల్గొన్నారు.
