

రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం
హర్షం వ్యక్తం చేసిన టిడిపి నేతలు
మన న్యూస్,ఎస్ఆర్ పురం:-
పేద ప్రజల అభివృద్ధి తన ద్వేయం లాగా నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ అన్నారు. ఆదివారం గంగాధర నెల్లూరు మండలం నెల్లెపల్లి పంచాయితీ బొబ్బిగానిపల్లి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రేషన్ ను వయోవృద్ధులు, వికలాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్ర పేద ప్రజల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తూ ప్రజల మన్నులకు పొందుతున్నారని అన్నారు నేడు సరికొత్త శ్రీకారం చుట్టి వయోవృద్ధులు వికలాంగులకు పంపిణీ చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుష్ప రాజ్, దేవరాజు నాయుడు, హేమ కుమార్ రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, వీఆర్వో లోకనాదం, రేషన్ షాప్ డీలర్ రేణుక తదితరులు పాల్గొన్నారు.