చౌక దుకాణాలను ప్రారంభించిన టీడీపీ నేత ఊట్ల సురేంద్ర నాయుడు

మన న్యూస్,తిరుపతి, :
నగరంలోని 44 డివిజన్లో 46 47 నిత్యవసర సరుకుల చౌక దుకాణాలను తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు చేతుల మీదుగా ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేంద్ర నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ల ఆలోచనలతోనే అన్ని వర్గాల ప్రజలు నిత్యవసర సరుకుల తీసుకొనే వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. ప్రతిరోజు రెండు పూటలా చౌక దుకాణాల యాజమాన్యం రేషన్ కార్డులు అందరికీ రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న మంచిది నిర్ణయాన్ని మనమంతా స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు ఇస్తామని ముసుగులో నిత్యవసర సరుకులు పక్కదారి పట్టాయి అన్నారు. వైసిపి నేతలు రేషన్ బియ్యాన్ని పంది కుక్కల్లాగా బొక్కేశారని , అలా జరగకూడదని అర్హులైన రేషన్ కార్డుదారులందరికీ నిత్యవసర సరుకులు అందేలా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఎవరికైనా నిత్యవసర సరుకులు వద్దనుకుంటే వారికి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా రేషన్ సక్రమంగా ఇవ్వకపోతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని వారిపై తక్షణమే చర్యలు తీసుకోవడం జరుగుతుందని సురేంద్ర నాయుడు చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శంకర్, సాయి, ఉదయ్, ధనుంజయ్, జయంతి, వాణి, వెంకట ముని, రమేష్ పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

  • By NAGARAJU
  • September 12, 2025
  • 2 views
కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 4 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి