

పిఠాపురం జూన్ 1 మన న్యూస్ :
రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల అనగా జూన్4వ తేదీన తలపెట్టిన వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణను పిఠాపురం నియోజకవర్గ వైయస్సార్సీపి కార్యాలయంలో పిఠాపురం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ వంగా గీతా విశ్వనాధ్ మున్సిపల్ చైర్మన్ గండేపల్లి బాబి మరియు వైఎస్ఆర్సిపి పట్టణ మరియు రూరల్ అధ్యక్షులు మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు పిఠాపురం నియోజకవర్గ మరియు మండల,పట్టణములలో నూతనముగా నియమించిన వైయస్సార్సీపి కమిటీ సభ్యులు పోస్టర్ ఆవిష్కరణ చేశారు.కూటమి ప్రభుత్వం ప్రజలకుహామీలు ఇచ్చి వాటిని గాలికి వదిలేసి,జరుగుతున్న అరాచకాలు అన్యాయాలపై వైసీపీ శ్రేణులంతా కలిసి పోరాడుతామని తెలియజెసారు.