

గంగాధర్ నెల్లూరు, మన న్యూస్. వైసీపీ పాలనలోనే హత్య రాజకీయాలు దోపిడీలు దోచుకోవడాలు దౌర్జన్యాలు జరిగాయి అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు శనివారం. గంగాధర్ నెల్లూరు మండలం ఎస్ ఎస్ కొండ లో వింజం పంచాయతీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పాడి రైతుల సబ్సిడీ దాన పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ పాల్గొన్నారు ఈ సందర్భంగాఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వంలో హత్య ,దోపిడీ, రౌడీయిజం రాజకీయం చేశారు
వైసిపి పాలనలో ఎస్సీలను చంపి డోర్ డెలివరీ చేశారు ఇలా చేయడాన్ని వెన్నుపోటు రాజకీయమంటారా? అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు రాజకీయమంటారా .. భూ కబ్జాలు చేసింది మీరే కదా గంజాయి అమ్మింది మీరే కదా భూ కబ్జాలు పాల్పడింది మీరే కదా అని ఘాటుగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ విమర్శించారు అలాగే వికలాంగులకు వీల్ చైర్ వాకింగ్ స్టిక్ అందించారు అనంతరం సుమారు 5 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు స్వామి దాసు యాదవ సాధికార సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ యాదవ్ కృష్ణం నాయుడు మాజీ మండల అధ్యక్షుడు దేవ సుందరం సగి కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
