మహానాడు కి తరలి వెళ్లేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై సమీక్ష నిర్వహించిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!!

వింజమూరు, మన న్యూస్ : ఈనెల 27,28, 29, తేదీలలో కడప జిల్లాలో జరిగే మహానాడు కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం నుండి తరలి వెళ్లేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై శనివారం స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో 8 మండలాల నాయకులు, 143 పంచాయతీల నాయకులతో,సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే శ్రీ దామంచర్ల జనార్ధన్ పర్యవేక్షణ గా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుండి ఏ మండలం నుండి ఎంతమంది వస్తున్నారో ఎవరెవరు వస్తున్నారు. జాగ్రత్తగా జాబితా తయారు చేసుకుని ఆ జాబితాను నియోజకవర్గ బాధ్యునికి అందజేయాలన్నారు. ఇక్కడ నుండి బయలుదేరి సమయంలో వారి యొక్క పేర్లను నమోదు చేసుకొని పేర్ల వారీగా బస్సుల్లో ఎక్కించుకోవాలన్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలనేటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉందన్నారు. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో ఏ మండలం నుండి వచ్చిన వారు ఆ మండలంలో ఉండి వచ్చిన వాహనంలోకి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరూ ఒకే చోట ఉండి రావాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మాట్లాడుతూ పండుగ వాతావరణం లో అందరం కలిసికట్టుగా మహానాడు ను జరుపుకోవాలన్నారు. బస్సులకు జెండాలు కట్టుకోవడం, సభ్యత్వం కార్డులను మెడలో వేసుకోవడం, మరువ వద్దు అని ఇక్కడ నుండి కదిలే క్రమంలో ర్యాలీగా వెళ్లడంతో పాటు, వీడియోలు ఫోటోలు కూడా బస్సులోకి ఎక్కిన తర్వాత కూడా, అందరిని ఒకసారి వీడియో తీయాలి అన్నారు. ఎవరి సీట్లలో వారు తిరుగు ప్రయాణంలో రావాలన్నారు. నేను కూడా మీ ర్యాలీలో కలుస్తానని తెలిపారు. క్రమ శిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో మెలిగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహానాడు ను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పోలీస్ హౌసింగ్ సొసైటీ మాజీ చైర్మన్ మెట్టుకూరి చిరంజీవి రెడ్డి,తెలుగు రైతు రాష్ట్ర కార్య నిర్వహహ కార్యదర్శి బొల్లినేని వెంకటరామారావు, రాష్ట్ర కార్యదర్శులు ఎల్ సి రమణారెడ్డి, మన్నేటి వెంకటరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, 8 మండలాల కన్వీనర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు