

శంఖవరం మన న్యూస్ (అపురూప్) : నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, ఆడపడుచులకు ఆసరాగా నిలుస్తూ ప్రజల మన్నలను పొందుతున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్య ప్రభ కు ఆ సత్య దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న శివ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి టీడీపీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర టిఎన్టియుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు (శివ) ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శాసన సభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా 47వ జన్మదిన వేడుకలు. నిర్వహించారు. ఈ సందర్బంగా కూటమి నాయకుల కోలాహాలం మధ్య భారీ కేకు కట్ చేసి తమ అభిమాన నాయకురాలు, ఎమ్మెల్యే సత్యప్రభ రాజాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ వరుపుల రాజాకి అత్యంత సన్నిహితుడిగా,ఎమ్మెల్యే సత్యప్రభ రాజా ప్రధాన అనుచరుల్లో ఒకరిగా ఉన్న వెన్నా శివ అనుచర గణం భారీ సంఖ్యలో ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం తో సందడి వాతావరణం నెలకొంది.ఈ సందర్బంగా భారీ బాణసంచా కాల్చి ఎమ్మెల్యే సత్యప్రభపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా నిన్న శివ మాట్లాడుతూ, దివంగత నేత స్వర్గీయ వరుపుల రాజా ఆశయాలకు కృషి చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడుతూ, నియోజకవర్గంలో టీడీపీ పూర్వ వైభవం తీసుకొచ్చారని గుర్తు చేశారు. అభివృద్దే ప్రధాన ధ్యేయంగా,ప్రజా సంక్షేమమే ప్రధమ లక్ష్యంగా పాలన కొనసాగిస్తున్న ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాధనాల లక్ష్మణ్ బాబు, గాబు కృష్ణ,గ్రామ కమిటీ ప్రెసిడెంట్ కేలంగి జనార్దన్,మండల పార్టీ యూత్ ప్రెసిడెంట్ గౌతు కన్నారావు, జనసేన పార్టీ శంఖవరం మండల అధ్యక్షుడు గాబు సుభాష్, దేశి లింగ వెంకటరమణ, గజ్జి సత్యనారాయణ, కేలంగి జాన,మాజీ ఎంపీటీసీ కంచిబోయిన శ్రీను, కొయ్యా రమణ,యర్రంశెట్టి బాబ్జి,కీర్తి కుమార్,నక్క శ్రీను, గాబు శివ, మచ్చ రాజు, కొయ్య రమణ, దూది సూరిబాబు, ఆలపు సత్యనారాయణ, కంది కోళ్ల హరీష్, పాలెపు దుర్గారావు, మిత్యాల సురేంద్ర, భారీ సంఖ్యలో కూటమి నాయకులు,వెన్నా శివ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.