రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి కూటమి నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కావలి పట్టణంలోని మన్నెం గోపాల కృష్ణారెడ్డి కళ్యాణమండపంలో ఆదివారం టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేశారు. ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సొంతంగా కావలిలో మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోలేదని తెలిపారు. 2024 ఎన్నికల్లో కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ రావడం జరిగిందని, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తల కృషి ఎనలేనిదని తెలిపారు. ఇదేవిధంగా రానున్న ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మునిసిపాలిటీని కైవసం చేసుకుందామని తెలిపారు. కావలి పట్టణంలోని ప్రతి సమస్యను పరిష్కరించడానికి ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రతి కార్యక్రమంలో బిజెపి, జనసేన నాయకులను కలుపుకొని పోదామని, వారికి ప్రాధాన్యత ఇద్దామని తెలిపారు. కావలి పై చంద్రబాబుకు ప్రత్యేకమైన ప్రేమ ఉన్నదని, అందుకే అత్యధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. 75 ఏళ్ల వయసులో దేశం కోసం మోడీ, రాష్ట్రం కోసం చంద్రబాబు చేస్తున్న కృషి ఎనలేనిదని తెలిపారు. నాకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసిన చంద్రబాబు రుణం తీర్చుకోలేనిదని, నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం అని తెలిపారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ లోకేష్ ను ముఖ్యమంత్రి గా చేసుకొని ఋణం తీర్చు కుంటానని తెలిపారు. 2024 ఎన్నికల్లో నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరిని వదులుకోనని తెలిపారు. నేను కష్టాల్లో ఉన్న సమయంలో చిన్న సహాయం చేస్తేనే మర్చిపోలేనని అలాంటిది రెండు నెలల పాటు నా ఎన్నికల కోసం కష్టపడిన నాయకులను కార్యకర్తలను ఎలా మర్చిపోగలనని అన్నారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రజా సమస్యల పరిష్కారం లో ఉంటామని, రాత్రి 7 గంటలు తరువాత నాయకులు, కార్యకర్తలు తమ సమస్యలను స్వయంగా తెలుపుకోవచ్చని తెలిపారు. రోజుకు 18 గంటల పాటు పనిచేస్తూ ఉన్నానని, మీ ప్రోత్సాహం కూడా అవసరమని తెలిపారు. వ్యాపారాలను సైతం పక్కన పెట్టి ప్రజాసేవ చేస్తున్నానని, నన్ను నమ్ముకున్న ప్రజల కోసం పార్టీ స్టేనుల కోసం నిరంతరం అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, విధ్వంసం నుండి అభివృద్ధి వైపుకు రాష్ట్రాన్ని తీసుకువస్తున్నారని తెలిపారు. కావలిని కాపు కాస్తానని, ముఖ్యమంత్రి సహకారం తో కావలి అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని తెలిపారు. దగదర్తి నుండి కొంతమంది నాయకులు, కావలి నుండి కొంతమంది నాయకులు త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారని, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు త్వరలోనే వారిని పార్టీలో చేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి, పోతుగంటి అలేఖ్య, కండ్లగుంట మధుబాబు నాయుడు, బోగోలు మండల టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, కావలి రూరల్ మండల టిడిపి అధ్యక్షులు ఆవుల రామకృష్ణ, అల్లూరు మండల టిడిపి అధ్యక్షులు బండి శ్రీనివాసులు రెడ్డి, పలగాటి శ్రీనివాసులు రెడ్డి, జనసేన కావలి పట్టణ అధ్యక్షులు పొబ్బ సాయి విటల్, సిద్దు, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్, టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    మన న్యూస్ : టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కల్యాణ్‌కు మాత్రమే కాదు… టాలీవుడ్ టాప్ స్టార్స్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు