రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.— ఏపీ ఆర్ సి ఎస్, ఏఐఎఫ్ టు యు డిమాండ్.

గొల్లప్రోలు మే 4 మన న్యూస్ :– రైతుల పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ, సీ.ఎం.ఆర్ కొనుగోలు, ఈ క్రాఫ్ నమోదు వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మరియు అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో మండల కేంద్రం గొల్లప్రోలు తహసిల్దార్ కార్యాల యం వద్ద ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కుంచె అంజిబాబు, జిల్లా నాయకులు డి నారాయణమూర్తి ల నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ ధర్నాకు ఏపీ ఆర్ సి ఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షు లు వల్లూరి రాజబాబు పాల్గొ ని మాట్లాడారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారన్నారు. జిల్లాలోని రైస్ మిల్లర్స్ సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరకే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ రైతుల ను దోపిడికి గురి చేస్తున్నారని విమర్శించారు. చాలాచోట్ల రైతులు ఈ క్రాఫ్ నమోదు చేసుకోకపోవడం, అవగాహన లేమితో తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఒకవైపు వాతావరణం అనుకూలంగా లేకపోవడం అదునుగా చూసుకుని రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం, జిల్లా లో రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. తక్షణమే పవన్ కళ్యాణ్ రైతుల సమస్యలపై దృష్టి సారించాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీ విముక్తి) నాయకులు డొక్కులూరి సంగీత, రెడ్డి దుర్గాదేవి, పారిశుద్ధ్య కార్మికుల సమాఖ్య కన్వీనర్ బొచ్చ యేసు ఏఐఎఫ్టీయూ మరియు ఏపీ ఆర్ సి ఎస్ నాయకులు గుడాల చార్లెస్, బల్ల సోమరాజు, వేగిశెట్టి గణేష్ తదితరులు నాయకత్వం వహించారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు