

నెల్లూరు జిల్లా, మన న్యూస్: అల్లీపురంలోని శ్రీ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మహర్దశ దక్కింది. రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో, శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వంలో అవసరమైన వసతుల కల్పనకు చర్యలు చేపట్టబడ్డాయి. ఈ సందర్భంగా రూ.1.35 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి సత్యకుమార్ యాదవ్కు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రహరీ నిర్మాణం, అదనపు భవనాలు, మీటింగ్ హాలు, వాచ్మెన్ గదులు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఇక రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు ఎంపీ నిధుల నుంచి రూ.30 లక్షల నిధులు కేటాయించేందుకు అంగీకరించారు. ఈ నిర్ణయాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. మిగిలిన నిధుల కేటాయింపును కూడా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు: “రాష్ట్రంలో పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థను రూపొందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కృషి జరుగుతోంది. అన్ని స్థాయిల్లో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను భర్తీ చేయడం, సెకండరీ హెల్త్ విభాగంలో 300 మంది ఇన్సర్వీస్ కోటా అభ్యర్థులతో పాటు మరో 300 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించడం జరుగుతోంది. స్పెషలిస్టుల కొరత నివారణకు చర్యలు చేపట్టాం. టీచింగ్ ఆసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించాం.” కృతజ్ఞతలు: రూ.30 లక్షల నిధులు కేటాయించేందుకు అంగీకరించిన బీద మస్తాన్ రావుకు ధన్యవాదాలు తెలిపారు శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు: ఎంపీ బీద మస్తాన్ రావు, ఏపీ ఆక్వా అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు, ఆర్టీసీ నెల్లూరు రీజినల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి, సురేంద్ర రెడ్డి, ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
