బంగారుపాళ్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మనన్యూస్ బంగారుపాళ్యం ఏప్రిల్-29*పూతలపట్టు నియోజకవర్గం,బంగారుపాళ్యం మండలం కేంద్రంలో గల ఎంపీడీవో కార్యాలయంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణా తరగతులను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ప్రారంభించారు. మంగళవారం ఉదయం బంగారుపాళ్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతుల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన *”పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్”* స్ధానిక మండల నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహిళల కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషను శిక్షణ తరగతులను మండల అధ్యక్షులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహిళల ఆర్ధిక స్వావలంబనతోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీ నాయకత్వం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా బంగారుపాళ్యం మండలానికి దాదాపు 200 కుట్టు మిషన్లను శాంక్షన్ చేయడం జరిగిందన్నారు. 75 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులను ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల శ్రేయస్సు కోరి అభివృద్ధి, సంక్షేమ పధకాలు అమలు చేసే ఘనత ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబిగా మారితేనే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చేందుతుందని నమ్మిన చంద్రబాబు గారు మహిళల కోసం అనేక ఉపాధి అవకాశాలు తీసుకొస్తున్నట్లు తెలియజేశారు. ఇది కేవలం శిక్షణా తరగతుల మాత్రమే కాదు. “మహిళ జీవితాన్ని మార్చే గొప్ప అవకాశంగా తీసుకోవాలని, మీరు స్వయం ఉపాధి పొందడమే కాకుండా మీతో పాటు మరికొంతమంది ఉపాధి కల్పించే స్ధాయికి ప్రతి మహిళ ఎదగాలని ఆశిస్తున్నట్లు పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు, ప్రధాన కార్యదర్శి జనార్థన్ గౌడ్, క్లస్టర్ ఇంఛార్జ్ ఎన్.పి‌. ధరణీ నాయుడు, చిత్తూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోక ప్రకాష్ మరియు మండల నాయకులు, అధికారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గోన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..