మీ కుటుంబానికి రూ. 5 కోట్ల వరకు ఆర్థిక భరోసానిచ్చే ఈ బీమా ఎలా తీసుకోవాలి?

Mana News :- అర్జున్‌కు 29 ఏళ్లు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. తన ఫ్రెండ్స్‌తో వీకెండ్‌లో జరుపుకొనే ఓ చిన్న టీ పార్టీకి చేసే ఖర్చు రూ. 800తో (నెలవారీ ఈఎంఐ చెల్లించి) టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్నారు. ఆయనకు ఏదైనా జరిగితే, తన కుటుంబానికి ఆర్థికంగా కొండంత భరోసాగా ఆ పథకం ఉంటుంది. అయితే ఇందులో ఎలాంటి మెచ్యూరిటీ బెనిఫిట్‌ ఉండదు. ఎలాంటి రిటర్న్స్‌ కూడా ఉండవు. ఇది పూర్తిగా ఓ ఫైనాన్షియల్‌ ప్రొటెక్షన్‌ ప్రొడక్ట్ మాత్రమే. భారత్‌లో ఇప్పటికీ బీమా ఉన్న వాళ్ల సంఖ్య మూడు శాతం లోపే ఉందంటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పాతిక వేలు పెట్టి ఫోన్‌ కొంటారు, లక్షలు పోసి బైక్‌, కార్‌ కొంటారు. కానీ, జీవితానికి ఇన్సూరెన్స్ ఎందుకు చేసుకోలేకపోతున్నాం? మన జీవితం ఆ వస్తువుల పాటి విలువ చేయదా? ఇంతకీ ఏమిటీ టర్మ్ ఇన్సూరెన్స్? ఇది ఎలాంటి కంపెనీల నుంచి తీసుకోవాలి? ప్రతీకాత్మక చిత్రం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అంటే? సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఇప్పుడు మార్కెట్లో ఉన్న అత్యంత చవకైన జీవిత బీమా ప్రొడక్ట్. వయసు ఆధారంగా కొన్నేళ్ల వరకు ప్రతి ఏటా కొంత మొత్తంలో ఫిక్స్‌డ్‌గా ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. ఈ పాలసీ సమయంలో ఏదైనా దుర్ఘటన జరిగితే, వారి కుటుంబానికి పెద్ద మొత్తంలో పాలసీ మొత్తం (Sum Assured) లభిస్తుంది. అలాంటిదేమీ జరగకపోతే పాలసీ ఎక్స్‌పైర్‌ అవుతుంది. ఎలాంటి రిటర్న్స్‌ ఉండవు. సాధారణ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల మాదిరిగా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ఎలాంటి రిటర్న్స్‌, సేవింగ్స్‌ ఉండవు. ఇది కేవలం ఓ ప్రొటెక్షన్‌ ప్లాన్‌.

Related Posts

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్

ఎస్ఆర్ పురం, మన న్యూస్… బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని టిడిపి యువ నాయకుడు సాఫ్ట్వేర్ బాలు అన్నారు ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఎస్ఆర్ పురం మండలం పిల్లారి కుప్పం క్రాస్ రోడ్డు జంక్షన్…

కనుల పండుగ ద్రౌపతి కళ్యాణ మహోత్సవం

మన న్యూస్, ఎస్ఆర్ పురం:- ఎస్ఆర్ పురం మండలం 49 కొత్తపల్లి మిట్ట లో మహాభారతం ఉత్సవాలు భాగంగా శుక్రవారం ఘనంగా ద్రౌపతి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

సిసి రోడ్డు  ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రాగుల వెంకటేశ్వర్ రెడ్డి

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

వి వి సి టాటా సేల్స్ అండ్ సర్వీస్ ప్రారంభం

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి

యూని కిడ్స్ ఫ్రీ స్కూల్ ను ప్రారంభించిన మర్రి నిరంజన్ రెడ్డి