మూగ జీవాలను రాజకీయం చేయడం తగదు,బహిరంగ చర్చకు సిద్ధమా…? టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం

మన న్యూస్,తిరుపతి : టీటీడీ గోశాలలోని మూగజీవాలను కూడా వైసిపి నాయకులు రాజకీయం చేయడం తగదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం చెప్పారు. శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్ వి గోసంరక్షణ శాలలో గత మూడు నెలలుగా 100 ఆవులు చనిపోయాయి అని భూముల కరుణాకర్ రెడ్డి చెప్పడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కరుణాకర్ రెడ్డి కి నైతిక విలువలు ఏమాత్రం లేవని, ప్రజలు మీ కుటుంబాన్ని తిరస్కరించిన మళ్లీ ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. రిలయన్స్ సంస్థ కోటి 35 లక్షల రూపాయలు నిధులను ఇచ్చారని ఆ డబ్బులతో 30 నుంచి 40 ఆవులు కొనుగోలు చేశారన్నారు. వాటిని తీసుకువచ్చే క్రమంలో కొన్ని అనారోగ్యానికి గురై చనిపోతే మరికొన్ని వయసు పైబడినవి చనిపోతూ ఉంటాయని చెప్పారు. గత నెల 28వ తేదీన ఓ రైలు బండిని ఒక ఆవు ఢీకొని చనిపోయిందని పేర్కొన్నారు. భువన కరుణాకర్ రెడ్డి చెప్పినట్లు వందల ఆవులు చనిపోలేదని ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. 2022 -23 సంవత్సరాలలో 90 గూగుల్ చనిపోయాయి అని, అప్పుడు ఎందుకు కరుణాకర్ రెడ్డి మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎస్ వి గోశాలలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్ వి గోసంరక్షణ అధికారి హరినాథ్ రెడ్డి సస్పెన్షన్కు గురైన టీటీడీకి చెందిన మొబైల్ ఫోను వినియోగిస్తూన్నారని వెంటనే ఆయన టీటీడీకి సెల్ ఫోన్ ను సిమ్ ను అప్పగించాలని కోరారు. వైసిపి ప్రభుత్వ హయాంలో 1500 గోవులు మాత్రమే గోశాలలో ఉండేవని, కూటమి ప్రభుత్వం వచ్చాక 200700 పైగా గోవులు సంరక్షణలో ఉన్నాయన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కరుణాకర్ రెడ్డి నిరూపించలేక పోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని, వెంటనే రాజకీయ సన్యాసం ప్రకటించాలని డిమాండ్ డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎం ఆర్ పల్లి రామచంద్రారెడ్డి, మధుబాబు, నందకుమార్, ఉమాపతి, ఖాజా పాల్గొన్నారు.

Related Posts

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

చిత్తూరు, మన ధ్యాస అక్టోబర్ 28: ‎రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు యర్రాపురెడ్డి సురేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలానికి చెందిన పి కమలాపతి రెడ్డి ని చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా, అలాగే తవణంపల్లె…

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి, అక్టోబర్ 27 :(మన ధ్యాస న్యూస్)://ఉదయగిరి మండల కేంద్రంలోని స్థానిక ఇందిరానగర్ కాలనీలో గత కొంతకాలం నుండి రోడ్డు పక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందని దారిన వెళ్లే ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?