బావోజీ జాతర కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు.

మన న్యూస్, నారాయణ పేట:కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి బావాజీ జాతర, గిరిజనుల ఆధ్యాత్మిక గురువు శ్రీ లోక మాసందు దేవాలయం జాతర 11, 12,13,14 తేదీలలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని కోస్గి సీ ఐ సైదులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం జాతర బందోబస్తుకొచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ,జాతరకు వచ్చే ప్రజలకు, భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పాయింట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని, వాహనాల కొరకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జాతరకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. తెల్లవారుజామున రథోత్సవం జరిగే సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా బారికేట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, రథం చుట్టూ రోప్ పార్టీలతో పోలీసు బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జాతరలో పోలీస్ పీకెట్స్, ఫుట్ పెట్రోలింగ్, దొంగతనాలు, దోపిడీలు జరగకుండా మఫ్టీలో పోలీసులు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. జాతరలో మహిళల, అమ్మాయిలను రక్షణ కొరకు షి టీమ్ పోలీసులతో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, జాతరలో ప్రత్యేక పోలీస్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందని జాతరకు వచ్చే భక్తులు చిన్నపిల్లలు ముసలి వాళ్లు ఎవరైనా తప్పిపోయిన పోలీస్ కంట్రోల్ రూమ్ లో లేదా దగ్గర్లోని పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేసి సమాచారమ్ ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్, బందోబస్తుకొచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్): ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.పెద్ద కొడప్ గల్ మండల కేంద్రంలో జరిగిన పోషణ మాసం మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం…

పేదోడి సొంతింటి కల నెరవేరింది..

మనధ్యాస,నిజాంసాగర్(జుక్కల్): సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుతో పేదోడి సొంతింటి కల నిజమవుతుందని నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు. సోమవారం సుల్తాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటికి ప్రారంభోత్సవం నిర్వహించారు.ఇందిరమ్మ పథకం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

  • By RAHEEM
  • October 28, 2025
  • 5 views
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?