బావోజీ జాతర కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు.

మన న్యూస్, నారాయణ పేట:కొత్తపల్లి మండలంలోని తిమ్మారెడ్డిపల్లి బావాజీ జాతర, గిరిజనుల ఆధ్యాత్మిక గురువు శ్రీ లోక మాసందు దేవాలయం జాతర 11, 12,13,14 తేదీలలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 150 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని కోస్గి సీ ఐ సైదులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం జాతర బందోబస్తుకొచ్చిన పోలీస్ అధికారులు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ,జాతరకు వచ్చే ప్రజలకు, భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పాయింట్స్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని, వాహనాల కొరకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జాతరకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. తెల్లవారుజామున రథోత్సవం జరిగే సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా బారికేట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, రథం చుట్టూ రోప్ పార్టీలతో పోలీసు బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జాతరలో పోలీస్ పీకెట్స్, ఫుట్ పెట్రోలింగ్, దొంగతనాలు, దోపిడీలు జరగకుండా మఫ్టీలో పోలీసులు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. జాతరలో మహిళల, అమ్మాయిలను రక్షణ కొరకు షి టీమ్ పోలీసులతో నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని, జాతరలో ప్రత్యేక పోలీస్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగిందని జాతరకు వచ్చే భక్తులు చిన్నపిల్లలు ముసలి వాళ్లు ఎవరైనా తప్పిపోయిన పోలీస్ కంట్రోల్ రూమ్ లో లేదా దగ్గర్లోని పోలీసులకు తెలియజేయాలని కోరారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి కాల్ చేసి సమాచారమ్ ఇవ్వాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్, బందోబస్తుకొచ్చిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 2 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///