

కొండాపురం మన న్యూస్ :
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుంకు ముడుసు ఎరుకలయ్య కు (40) తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. కొండాపురం మండలం సాయి పేట పంచాయతీ చెందిన దామా శివబాబు జరిగిన ప్రమాదం గురించి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి తెలియజేశారు. పేద కుటుంబం, తెలుగుదేశం కుటుంబ సభ్యుడు అని తెలియపరచగా వెంటనే స్పందించిన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ 15000 ఆర్థిక సహాయం చేయడంతో పాటు కొండాపురం మండలం నాయకులకు కుంకు ముడుసు కుటుంబానికి అండగా నిలవాలని, వారికి భరోసా కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. టిడిపి పార్టీ బీమా వర్తించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. స్థానిక నాయకుల సహకారంతో దామ శివ బాబు నాయకులతో కలిసి మృతుని నివాసానికి చేరుకొని వారికి అండగా ఉంటామని భరోసా కల్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ప్రమాదం కేసుగా నమోదు చేయించి, పోస్టుమార్టం రిపోర్ట్ తదితర అంశాలు తీసుకోవాల్సిన చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. మృతునిది కొండాపురం మండలం సాయి పేట పంచాయతీ కొమ్ము పాలెం గ్రామం మంగళవారం కందుకూరు నియోజకవర్గం లోని చిన్నపౌను గ్రామానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రింద పడింది. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను 108 ద్వారా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే మార్గమధ్యంలో మృతి చెందారు. ఆయనకు భార్య కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుంకుముడుసు ఎరుకలయ్య టిడిపి సభ్యత్వం పొంది ఉన్నారు. దీంతో ప్రమాద బీమా సుమారు 5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. బీమా వర్తించేందుకు కావలసిన రిపోర్టులను సిద్ధం చేశారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు బీమా వర్తించేందుకు కృషి చేస్తామన్నారు. స్థానిక టిడిపి నాయకులు దామా శివ బాబు అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.