రోడ్డు ప్రమాదాల మృతి చెందిన కుంకుమొడుసు ఎరుకులయ్యకు టిడిపి అండ, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో 1,50,000 టీడీపీ ప్రమాద భీమా

కొండాపురం మన న్యూస్ :

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుంకు ముడుసు ఎరుకలయ్య కు (40) తెలుగుదేశం పార్టీ అండగా నిలిచింది. కొండాపురం మండలం సాయి పేట పంచాయతీ చెందిన దామా శివబాబు జరిగిన ప్రమాదం గురించి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి తెలియజేశారు. పేద కుటుంబం, తెలుగుదేశం కుటుంబ సభ్యుడు అని తెలియపరచగా వెంటనే స్పందించిన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ 15000 ఆర్థిక సహాయం చేయడంతో పాటు కొండాపురం మండలం నాయకులకు కుంకు ముడుసు కుటుంబానికి అండగా నిలవాలని, వారికి భరోసా కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. టిడిపి పార్టీ బీమా వర్తించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. స్థానిక నాయకుల సహకారంతో దామ శివ బాబు నాయకులతో కలిసి మృతుని నివాసానికి చేరుకొని వారికి అండగా ఉంటామని భరోసా కల్పించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ప్రమాదం కేసుగా నమోదు చేయించి, పోస్టుమార్టం రిపోర్ట్ తదితర అంశాలు తీసుకోవాల్సిన చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. మృతునిది కొండాపురం మండలం సాయి పేట పంచాయతీ కొమ్ము పాలెం గ్రామం మంగళవారం కందుకూరు నియోజకవర్గం లోని చిన్నపౌను గ్రామానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి క్రింద పడింది. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను 108 ద్వారా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే మార్గమధ్యంలో మృతి చెందారు. ఆయనకు భార్య కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుంకుముడుసు ఎరుకలయ్య టిడిపి సభ్యత్వం పొంది ఉన్నారు. దీంతో ప్రమాద బీమా సుమారు 5 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంది. బీమా వర్తించేందుకు కావలసిన రిపోర్టులను సిద్ధం చేశారు. ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు బీమా వర్తించేందుకు కృషి చేస్తామన్నారు. స్థానిక టిడిపి నాయకులు దామా శివ బాబు అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

  • Related Posts

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్…

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    మన న్యూస్, కావలి :*నా జీవితం తెలుగుదేశం పార్టీకి అంకితం.*నా గెలుపు కోసం కష్టపడిన ఏ ఒక్కరినీ వదులుకోను.కావలి మున్సిపాలిటీలోని 40 కి 40 వార్డులు కూటమి ప్రభుత్వం గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ గా ఇద్దామని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    అమరావతి రాజధాని మహిళల పట్ల సాక్షి ఛానల్ లో మాట్లాడిన మాటలను ఖండించాలి.

    కావలిలో టిడిపికి మద్దతు పలికిన జనిగర్ల మహేంద్ర యాదవ్

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    రాబోయే కాలంలో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం… కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విజయవాడలో ‘సెలూన్ కొనికి’ లాంచ్

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    AP ప్రాక్టిసింగ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ నూతన కార్యవర్గ ప్రెసిడెంట్ గా పిఠాపురం న్యాయవాది బొలిశెట్టి గౌరిమణి.

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు

    ఎండియు వాహనాలను కొనసాగించాలి, సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు