

వరికుంటపాడు మన న్యూస్ :
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదలకు కడుపు నింపటానికి ఎంతో ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టిన కేంద్ర ప్రభుత్వం , ఆ దిశగా తక్షణ చర్యలు చేపట్టడంలో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గం లోని వరికుంటపాడు మండలంలో ఉపాధి హామీ పనులలో భారీ అవినీతి జరుగుతున్న అధికారులు పట్టించుకోకపోవడానికి ఏ అధికారి ముందుకు రావటం లేదు…?ముడుపులు ఎంత భారీ మొత్తంలో అందుతున్నాయి అని ప్రజలు చర్చించుకుంటున్నారు..? ఫీల్డ్ అసిస్టెంట్లు,
టి ఏ లు ,ఈ సీలు ,సి ఓ లు, ఏపీఓ లు ప్రతి ఒక్కరూ సామాన్యుడి నుండి దోచుకుంటూ దాచుకుంటున్నారు. వారానికి 100 రూపాయలు ఇస్తేనే మస్టర్లు వేస్తున్నారని స్వయంగా కూలీల చెబుతున్న పట్టించుకోని, ఉన్నతాధికారులు. వారి వాటా పోగొట్టుకోలేక చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతివారం 100 రూపాయలు ఇవ్వకపోతే మాకు మస్టర్లు వేయడం లేదని, పనికి వెళ్లినా కూడా, తగిన కూలీలు రావటం లేదని, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉండి పని చేసిన వాళ్లకి మస్టర్లు వేయకుండా,ఏకంగా ఇక్కడలేని మనుషుల మస్టర్లు వేసినా,ఆఖరికి ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటున్నా వారికి మస్టర్లు వేసి,జెసిబి లు ఉపయోగించి పనులు చేయినచ్చి ఉపాధి కూలీలను నిర్వహించినట్లు లెక్కలు చూపుతున్న అధికారులకు ఏమి పట్టడం లేదు…?వరికుంటపాడు మండలంలో ఉపాధి హామీ పనులలో సిబ్బంది చేతివాటం లక్షల్లో ఉందనేది జగమెరిగిన సత్యం.కూలీలు ఏదైనా నోరు తెరిసి నిజం చెప్తే వాళ్లను ఫీల్డ్ అసిస్టెంట్ బెదిరింపులకు గురి చేస్తున్నాడు,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఉపాధి కూలీలు కోరుతున్నారు.