హెచ్సియు విద్యార్థుల అక్రమ అరెస్టులు, దమనకాండ అప్రజాస్వామికం – ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్.

మన న్యూస్ , తిరుపతి:- స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు ఈరోజు ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం AISA జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం విద్యార్థి సంఘాలు కొనసాగిస్తున్న పోరాటాలపై ప్రభుత్వం దమనకాండను ప్రయోగించడం అప్రజాస్వామ్యమని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు అన్నారు. 400 ఎకరాలను వేలం వేయడం ద్వారా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరుస్తూ వేల కోట్ల రూపాయలను దండుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తీవ్రంగా విమర్శించారు. హెచ్సీయూ భూముల జోలికి వెళ్లడం అంటే ప్రభుత్వం పతనాన్ని కోరుకోవడమే అవుతుందని తెలిపారు. ప్రభుత్వ భూముల్ని రక్షిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తీరు పచ్చి అవకాశవాదంగా ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఏడవ వాగ్దానంగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తమ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ భూములపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలని అణచివేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (AISA), SFI, ఇతర విద్యార్థి సంఘాల అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు, ప్రజాతంత్ర శక్తులు ముక్తకండంతో ఖండించాలని ఆయన కోరారు. విద్యార్థినిల పట్ల పోలీస్ బలగాలు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని తెలిపారు. విద్యార్థులను అవమానకరంగా వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం కల్పించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ వేణు, వంశీ కృష్ణవంశీ, మహేంద్ర, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 3 views
దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

  • By NAGARAJU
  • September 10, 2025
  • 4 views
అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు