హెచ్సియు విద్యార్థుల అక్రమ అరెస్టులు, దమనకాండ అప్రజాస్వామికం – ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు రంజిత్ కుమార్.

మన న్యూస్ , తిరుపతి:- స్థానిక శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నందు ఈరోజు ఆలిండియా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం అనంతరం AISA జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్ మాట్లాడుతూహైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రక్షణ కోసం విద్యార్థి సంఘాలు కొనసాగిస్తున్న పోరాటాలపై ప్రభుత్వం దమనకాండను ప్రయోగించడం అప్రజాస్వామ్యమని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు అన్నారు. 400 ఎకరాలను వేలం వేయడం ద్వారా కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూరుస్తూ వేల కోట్ల రూపాయలను దండుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తీవ్రంగా విమర్శించారు. హెచ్సీయూ భూముల జోలికి వెళ్లడం అంటే ప్రభుత్వం పతనాన్ని కోరుకోవడమే అవుతుందని తెలిపారు. ప్రభుత్వ భూముల్ని రక్షిస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తీరు పచ్చి అవకాశవాదంగా ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఏడవ వాగ్దానంగా చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తమ పరిపాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ భూములపై ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటాలని అణచివేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (AISA), SFI, ఇతర విద్యార్థి సంఘాల అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు, ప్రజాతంత్ర శక్తులు ముక్తకండంతో ఖండించాలని ఆయన కోరారు. విద్యార్థినిల పట్ల పోలీస్ బలగాలు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని తెలిపారు. విద్యార్థులను అవమానకరంగా వేధించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీలో శాంతియుత వాతావరణం కల్పించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ వేణు, వంశీ కృష్ణవంశీ, మహేంద్ర, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

మన న్యూస్, నెల్లూరు : నిరుపేదలు తమ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించే క్రమంలో వారు పడుతున్న ఇబ్బందులను దగ్గర్నుంచి చూశాను కాబట్టే.. ప్రతి స్టూడెంట్ కి నాణ్యమైన విద్యను అందించాలని వి ఆర్ హైస్కూల్ ని తీర్చిదిద్దుతున్నానని మంత్రి పొంగూరు…

మూడవ రోజు రాత్రి వాహన సేవ

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు (08-06-2025, ఆదివారం) రాత్రి 8 గంటలకు హంస వాహన సేవను వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామివారు హంస…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

పేద పిల్లలకు డిజిటల్ విద్య అందించడమే నా డ్రీమ్ …….రాష్ట్ర  పట్టణాభివృద్ధి ,పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ

మూడవ రోజు రాత్రి వాహన సేవ

మూడవ రోజు రాత్రి  వాహన సేవ

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

మద్యం మత్తులో బీరు సీసాతో దాడి

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

నెల్లూరు ,బృందావనంలో రాష్ట్రమంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా పోనిక్స్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

జగన్ రెడ్డి క్షణం క్షమాపణ చెప్పాల్సిందే ……తెలుగుదేశం తెలుగు మహిళా విభాగం

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర

నెల్లూరు రాజకీయ ముఖ చిత్రంలో ఆనం వెంకటరెడ్డి జరిగిన ముద్ర